Warangal : వరంగల్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరనున్నారు.

Warangal : వరంగల్ కు సీఎం కేసీఆర్

Mgm

MGM Hospital : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్..వరంగల్ లో పర్యటించనున్నారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం బేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాప్ట‌ర్‌లో వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరనున్నారు. ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. అక్కడ కోవిడ్ రోగులతో మాట్లాడనున్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్‌ మనోధైర్యం అందించిన సంగతి తెలిసిందే.

స్వయంగా ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కోవిడ్ చికిత్సలు, ఇతర సదుపాయాలు పరిశీలించారు. వైద్యులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని కూడా సందర్శించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వైద్యం, తదితర వివరాలను తెలుసుకోనున్నారు. దీంతో పాటు ఆయన వైద్యులు, సిబ్బందితో ముచ్చటించనున్నారు.

ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హన్మకొండకు సీఎం హెలికాప్ట‌ర్‌లో చేరుకుంటారు. అక్క‌డి నుంచి రాజ్య‌స‌భ సభ్యుడు కెప్టెన్ ల‌క్ష్మీ కాంత‌రావు ఇంటికి వెళ్ల‌నున్నారు. ఇక్కడే భోజనం చేయనున్నారు. అనంతరం సెంట్ర‌ల్ జైలును సంద‌ర్శించ‌నున్నారు. తర్వాత..సీఎం కేసీఆర్ ఎంజీఎం ఆసుపత్రిని సంద‌ర్శిస్తారు. తిరిగి కెప్టెన్ ల‌క్ష్మీ కాంత‌రావు ఇంటికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకొని.. అనంత‌రం హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

Read More : AP High Court : జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై హైకోర్టు తీర్పు