Kiyara Advani : వేరే హీరోయిన్స్ తో పోల్చినా మంచిదే అంటున్న కియారా..

తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా...............

Kiyara Advani : వేరే హీరోయిన్స్ తో పోల్చినా మంచిదే అంటున్న కియారా..

Kiyara

Kiyara Advani :  హీరోయిన్లు పైకి కనబడరు కాని, తమని వేరే వాళ్లతో పోల్చితే అస్సలు ఇష్టపడరు. ఎవరి స్టైల్ వాళ్లదే అంటూ కొట్టి పడేస్తారు. కాని కియారా అద్వానీ రూటే వేరు. వేరే హీరోయిన్లతో పోల్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది. సమకాలీకులతో పోల్చడాన్ని దాదాపు ఏ హీరోయిన్ అయినా అంగీకరించదు. కాని కియారా అద్వానీ స్పందన మాత్రం భిన్నంగా ఉంది. కియారా లేటెస్ట్ గా భూల్ భూలయా 2తో ఫుల్ సక్సెస్ మూఢ్ లో ఉంది. కార్తిక్ ఆర్యన్ తో జోడి కట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్నే అందుకుంది. అదే జోష్ తో తన లేటెస్ట్ మూవీ జగ్ జగ్ జీయో ప్రమోషన్స్ లో పాల్గొంటుంది కియారా.

ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న కియారాను ఓ ఇంటర్వ్యూలో ఆలియా భట్, దీపికా పదుకొనేతో పోల్చారు. దానికి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీపికా, ఆలియా గొప్ప నటులని వాళ్లను తాను ఆరాధిస్తానని అలాంటిది వాళ్లతో తనను పోల్చితే మరింత ప్రేరణ పొందుతానని చెప్పింది. వేరే వాళ్ళతో పోలిస్తే మంచిదే కదా అంటుంది కియారా. ప్రస్తుతం కియారా అద్వాని జగ్ జగ్ జియో ప్రమోషన్స్ లో తనవంతు కృషి చేస్తోంది. ఈ సినిమాలో వరుణ్ దావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్ లతో నటించింది. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ది పంజాబన్ సాంగ్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ నుంచి సెలబ్రిటీస్ వరకు ఈ సాంగ్ పైన షార్ట్స్, రీల్స్ చేసి సినిమాపైన అంచనాలు పెంచేశారు. ఈ సినిమా కియారాకు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.

 

Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..

తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామా, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సరసన నటిస్తున్న కియారా, ఎన్టీఆర్ 30 సినిమాలోనూ నటిస్తుందని టాక్ నడుస్తుంది. ఇక బాలీవుడ్ లో అయితే దాదాపు అరడజను సినిమాలు కియారా చేతిలో ఉన్నాయి.