Himachal By Poll Results : బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ క్లీన్ స్వీప్
హిమాచల్ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది కాషాయ పార్టీ.
Himachal By Poll Results హిమాచల్ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది కాషాయ పార్టీ. మండీ లోక్సభ సహా, మూడు అసెంబ్లీ స్థానాలకు(జుబ్బల్-కోట్కాయ్, ఫతేపుర్, అర్కీ) ఉప ఎన్నికలు జరుగ్గా..అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కీ నుంచి సంజయ్, జుబ్బల్ నుంచి రోహిత్ ఠాకూర్లు గెలుపొందారు.
మండీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా హిమాచల్ మాజీ సీఎం విరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కార్గిల్ వార్ హీరో కుశాల్ సింగ్ ఠాకూర్పై 8766 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. అప్పుడు గెలిచిన ఎంపీ రామ్ స్వరూప్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
ALSO READ Maharashtra Deputy CM : అజిత్ పవార్కు ఐటీ షాక్..రూ.1000కోట్ల ఆస్తులు సీజ్