Himachal By Poll Results : బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ క్లీన్ స్వీప్

హిమాచల్​ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కోల్పోయింది కాషాయ పార్టీ.

Himachal By Poll Results : బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్ క్లీన్ స్వీప్

Con

Himachal By Poll Results హిమాచల్​ప్రదేశ్ ఉపఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదరుదెబ్బ తగలింది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కోల్పోయింది కాషాయ పార్టీ. మండీ లోక్​సభ సహా, మూడు అసెంబ్లీ స్థానాలకు(జుబ్బల్​-కోట్కాయ్​, ఫతేపుర్, అర్కీ) ఉప ఎన్నికలు జరుగ్గా..అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఫ‌తేపూర్ నుంచి భ‌వానీ సింగ్‌, ఆర్కీ నుంచి సంజ‌య్‌, జుబ్బ‌ల్ నుంచి రోహిత్ ఠాకూర్‌లు గెలుపొందారు.

మండీ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిగా హిమాచల్​ మాజీ సీఎం విరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి కార్గిల్ వార్ హీరో కుశాల్ సింగ్ ఠాకూర్​పై 8766 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. అప్పుడు గెలిచిన ఎంపీ రామ్​ స్వరూప్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.

ALSO READ Maharashtra Deputy CM : అజిత్​ పవార్​కు ఐటీ షాక్..రూ.1000కోట్ల ఆస్తులు సీజ్