AICC : ఎక్కడ తప్పు జరిగింది ?.. సీడబ్ల్యూసీ మీటింగ్, టైం ఫిక్స్

ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ జరుగనుంది. ఏఐసీసీ (AICC) ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో...

AICC : ఎక్కడ తప్పు జరిగింది ?.. సీడబ్ల్యూసీ మీటింగ్, టైం ఫిక్స్

CWC

CWC Meeting To Be Held Tomorrow : ఎక్కడ తప్పు జరిగింది ? ఎందుకు ఓడిపోయాం ? కారణాలేంటీ ? అనే దానిపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎన్నిక ఫలితాలు రావడం..అందులో పార్టీ ఘోర పరాజయం చెందడం.. వెంటనే మీటింగ్స్ ఏర్పాటు చేయడం కామన్ అయిపోయాయి. తాజాగా భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో (ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్) జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) మీటింగ్ జరుగనుంది. 2022, మార్చి 13వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ఆఫీసులో జరిగే ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు.

Read More : Russia Offered India : భారత్‌కు మరోసారి రష్యా బంపర్‌ ఆఫర్‌

అంతకంటే ముందు… కాంగ్రెస్ లో అసంతృప్త నేతలుగా (గ్రూప్ 23)ముద్ర పడిన కొందరు సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఈ సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం, ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ భేటీకి ఎంపీలు కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారిలు కూడా ఉన్నారు. ఫలితాలతో తాను దిగ్ర్భాంతికి గురయినట్లు, ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా అంటూ… గులాంనబీ ఆజాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికైనా నాయకత్వం గమనించి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మరికొంత మంది నేతలు కూడా వ్యాఖ్యానించారు.

Read More : Bhagavanth Maan: పంజాబ్ కొత్త సీఎంగా.. 16న భగవంత్ ప్రమాణం

ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని ఇతర పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని ఎన్నో రోజులుగా కాంగ్రెస్ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్లు అవుతున్నాయి. 2014 నుంచి 45 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం నెగ్గింది ఐదు మాత్రమే. ఇప్పుడు రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, అంతర్గత కలహాలు, నేతల మధ్య అభిప్రాయ బేధాలతో కాంగ్రెస్ లో లుకలుకలకు కారణమౌతున్నాయి. దీనితో 23 మంది పార్టీ సీనియర్ నేతలు నేరుగా అధిష్టానికి ఓ లేఖ రాయడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. జీ 23గా పేరు పెట్టి.. అందులో ఉన్న నేతలను వేరుగా చూడడం ప్రారంభించింది. నానాటికి పార్టీ ప్రతిష్ట దిగజారుతుండడం, సీనియర్లను పక్కకు పెట్టిన యువ రక్తానికి అవకాశం కల్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

Read More : Mamata Banerjee: మమతా బెనర్జీ సంచలన ప్రకటన

403 స్థానాలున్న యూపీలో 02 సీట్లు, 117 సీట్లున్న పంజాబ్ రాష్ట్రంలో 18, 70 సీట్లున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 70 సీట్లు, గోవాలో 20 సీట్లుంటే.. 12, మణిపూర్ లో 60 అసెంబ్లీ సీట్లుంటే 06 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.