Maa Palle Charitable Trust : దిల్‌రాజు ట్రస్ట్.. రైతుల కోసం.. దేవుడి కోసం..

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ''నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలో ఇందూరు రైతుల సహకారంతో మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించి ఈ ట్రస్ట్ లోని రైతుల ద్వారా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం...........

Maa Palle Charitable Trust : దిల్‌రాజు ట్రస్ట్.. రైతుల కోసం.. దేవుడి కోసం..

Dil Raju

Dil Raju :  డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ పొజిషన్ లో ఉన్నారు దిల్‌రాజు. ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టుల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దిల్‌రాజు తన సొంతూరు నిజామాబాద్ జిల్లా ఇందూరులో తన కుటుంబ సభ్యులతో కలిసి గతంలో ఓ ట్రస్ట్ ని స్థాపించారు. ‘మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌’ అనే పేరుతో దిల్‌రాజు కుటుంబం దీన్ని నిర్వహిస్తుంది. తాజాగా హైదరాబాద్ లో దీనికి సంబంధించి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఈ ట్రస్ట్ గురించి, ఇది చేస్తున్న సేవల గురించి వివరించారు. దిల్‌ రాజు, ఆయన సోదరులు నరసింహారెడ్డి, శిరీష్‌, దర్శకులు వేణు శ్రీరామ్‌, వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, హీరో శ్రీకాంత్, పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ”నిజామాబాద్‌ జిల్లా నర్సింగ్‌పల్లిలో ఇందూరు రైతుల సహకారంతో మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ స్థాపించి ఈ ట్రస్ట్ లోని రైతుల ద్వారా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ పండిన ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి నైవేద్యం తయారీకి పంపిస్తున్నాం. రైతుల బాగు కోసం, దేవుడికి పవిత్రమైన పంటని ప్రసాదం తయారీకి పంపాలని ఈ ట్రస్ట్ ని నిర్వహిస్తున్నాం. ఈ ట్రస్ట్‌ నుంచి ప్రజలు విరాళాల రూపంలో ధాన్యం కొని తిరుమలకు పంపించొచ్చు. 10 కిలోల నుంచి ఎంతైనా ధాన్యం కొని దేవుడి నైవేద్యానికి విరాళంగా ఇవ్వొచ్చు. ఇక్కడ రైతులు అత్యంత నిష్టగా వ్యవసాయ పనులు చేస్తారు” అని తెలిపారు.

Abhishek Singh : యాక్టర్ గా మారిన IAS ఆఫీసర్

దిల్‌రాజు సోదరుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ”దేవుడి గుడిలోకి ఎంత పవిత్రంగా మనం అడుగుపెడతామో, అంతే పవిత్రంగా మా రైతులు ఇక్కడ పొలంలోకి వెళ్తారు. అందుకే దీన్ని ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం అని పిలుస్తున్నాం. మా పల్లె చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఇక్కడ పండిన పంటను తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి నైవేద్యం కోసం పంపడం మా అదృష్టంగా భావిస్తున్నాం” అని అన్నారు. మిగిలిన ప్రముఖులంతా కూడా ఈ ట్రస్ట్ ని కొనియాడుతూ మాట్లాడారు.