Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే... మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది.

Russia-Ukraine : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య ప్రారంభమైన చర్చలు

Meeting (2) (1)

Russia and Ukraine discussions : ఎట్టకేలకు రష్యా-యుక్రెయిన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్‌ వేదికగా రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు హాజరయ్యారు. యుక్రెయిన్ తరపున చర్చల్లో ఆ దేశ రక్షణమంత్రి పాల్గొన్నారు. తక్షణమే రష్యా యుక్రెయిన్‌పై దాడులు ఆపాలని… సైన్యాన్ని వెనక్కి పంపాలని చర్చలకు ముందు యుక్రెయిన్ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య చర్చలు సాగుతున్నాయి. రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ముగుస్తుందో.. కొననసాగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

అయితే కీవ్‌లోని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు దారులు తెరిచామని స్పష్టం చేశారు. తమ లక్ష్యం సామాన్య ప్రజలు కాదన్న పుతిన్… పౌరులపై దాడులు చేయమని చెప్పారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కౌంటర్ ఇచ్చారు. రష్యా సైనికులు యుక్రెయిన్‌ను విడిచి తమ ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. అలాగే తక్షణమే తమకు ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. కీవ్‌లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తోన్నారు.

Russia-Ukraine war : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ..

అయితే చర్చలకు ముందు బెలారస్ సంచలన ప్రకటన చేసింది. రష్యాపై ఆంక్షలు మరిన్ని పెంచితే… మూడో ప్రపంచయుద్ధం తప్పదని హెచ్చరించింది. చర్చలకు ముందు రష్యా, యుక్రెయిన్ చేసిన ప్రకటనలు తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్ మొత్తం తమ ఆధీనంలో ఉందని రష్యా ప్రకటించింది. ఆ తర్వాత కాసేపటికే యుక్రెయిన్ భిన్నమైన ప్రకటన చేసింది. యుద్ధంలో నైతిక విజయం తమదేనని, రష్యా మానసిక స్థైర్యం కోల్పోయిందని, బలహీనపడిందని ఆరోపించింది.

పౌరుల నివాసాలపైనా రష్యా ఆర్మీ దాడులు చేసిందని, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా యుక్రెయిన్‌ను ఆక్రమించుకోలేకపోయిందని ఆరోపించింది. అయితే యుక్రెయిన్ ఆరోపణలను తోసిపుచ్చింది రష్యా. ప్రజలను యుక్రెయిన్ ఆర్మీ మానవకవచంలా వాడుకుంటోందని ఎదురుదాడి చేసింది. రష్యా దళాలకు యుక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఉందని బ్రిటన్ అంటోంది. కీవ్‌కు 30కిలోమీటర్ల దూరంలోనే రష్యా బలగాలు నిలిచిపోయాయని బ్రిటన్ ప్రకటించింది.

Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!

మరోవైపు యుద్ధం, ఆంక్షలతో రష్యా ఆర్థికవ్యవస్థ పతనమవుతోంది. ఇది భారంగా మారడంతో ఆర్థికవ్యవస్థను మెరుగుపరిచేందుకు కీలకనిర్ణయాలు తీసుకుంటోంది రష్యా. వడ్డీరేట్లను 9.5శాతం నుంచి ఏకంగా 20శాతానికి పెంచింది సెంట్రల్ బ్యాంక్. విదేశీ కరెన్సీలో ఉన్న ఆదాయాన్ని 80శాతం అమ్ముకుని రూబుల్ కొనాలనీ ఆదేశించింది. అటు యుక్రెయిన్‌ ప్రజలను శరణార్థులుగా మార్చుతోంది యుద్ధం. యుద్ధం మొదలయిన తర్వాత 4లక్షలమంది పౌరులు
యుక్రెయిన్‌ను వీడి వెళ్లిపోయారు.