Sanjay Raut: నాపై దాడి చేసేందుకు సీఎం కుమారుడి సుపారీ: సంజయ్ రౌత్

ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్‌నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు. శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు.

Sanjay Raut: నాపై దాడి చేసేందుకు సీఎం కుమారుడి సుపారీ: సంజయ్ రౌత్

Sanjay Raut: తనపై దాడి చేసేందుకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు గూండాలకు సుపారీ ఇచ్చాడని ఆరోపించారు ఎంపీ సంజయ్ రౌత్. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్, ఇటీవల బీజేపీతోపాటు, సీఎం ఏక్‌నాథ్ షిండేపై ఆరోపణలు చేస్తున్నారు.

Anonymous Donor: చిన్నారికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.11 కోట్లు దానం చేసిన గుర్తు తెలియని వ్యక్తి

శివసేన గుర్తు కోసం రూ.2000 కోట్ల ఒప్పందం కుదిరిందని ఇటీవలే ఆరోపించిన సంజయ్ రౌత్ తాజాగా మరో సంచలన ఆరోపణ చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే కొడుకు, ఎంపీ శ్రీకాంత్ షిండేపై ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసేందుకు శ్రీకాంత్ షిండే గూండాలకు సుపారీ ఇచ్చాడని మంగళవారం ఆరోపించారు. ఈ మేరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఒక లేఖ రాశారు. ‘‘నా భద్రతకు సంబంధించిన విషయాల్ని ఎన్నోసార్లు మీ దృష్టికి తీసుకొచ్చా. శివసేన, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక నాకు భద్రత తగ్గించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నా.

AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

అధికార పార్టీ ఎమ్మెల్యేలు, గూండాల నుంచి నాకు ఎన్నో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నాపై దాడి చేసేందుకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. థానేలోని రాజా ఠాకూర్ అనే గూండాకు ఈ కాంట్రాక్ట్ అప్పగించినట్లు తెలిసింది. అతడు నాపై ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. నేనొక ఎంపీని, సామ్నా పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయినప్పటికీ, ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను’’ అని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించాల్సిందిగా ఉద్ధవ్ థాక్రే వర్గాలు కోరుతున్నాయి.