Supreme Court : GST పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..అవసరమైతే రాష్ట్రాలు వేరు వేరు చట్టాలు చేసుకోవచ్చు..

జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చు అని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది.

Supreme Court : GST పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..అవసరమైతే రాష్ట్రాలు వేరు వేరు చట్టాలు చేసుకోవచ్చు..

Supreme Court..gst

Supreme Court..GST : జీఎస్టీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అంతేకాదు అవసరమైతే ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలు, పార్లమెంట్ చట్టాలు చేసుకోవచ్చు అని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం గురువారం (మే 19,2022) వెల్లడించింది.

దీనికి సంబంధించి కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారులున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్టికల్ 246A, 279 కింద ఉన్న నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయని, ఒకదానికొకటి స్వతంత్రంగా వ్యవహరించ లేవని.. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.ఏకాభిప్రాయం రావడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరగాల్సి అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

నిబంధనలు పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రాలకు సమాన అధికారులు ఉన్నాయని గుర్తు చేసింది. కోఆపరిటివ్ పెడరలిజం సూత్రాలను కోర్టు తీర్పు హైలెట్ చేసింది.జీఎస్టీ 2007 ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.

జీఎస్టీ 2007 ప్రకారంగా సముద్ర రవాణాపై పన్ను విధించడానికి సంబంధించి గుజరాత్ హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పిల్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఓడలో వస్తువుల రవాణా సేవలపై 5 శాతం ఐజీఎస్టీ విధించాలని 2017 ప్రభుత్వం నోటిపికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది.

మోహిత్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ , కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. రివర్స్ చార్జీ కింద సముద్రపు సరుకు రవాణాపై దిగుమతిదారులపై కూడా ఐజీఎస్టీ విధించడాన్ని గుజరాత్ హైకోర్టు 2020లో రద్దుచేసింది. ఇదే తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్ర ప్రభుత్వం 2017 జూన్ లో నోటిఫికేషన్ 8 ద్వారా నౌకలో వస్తువుల రవాణా సేవపై 5 శాతం ఐజీఎస్టీని విధించింది. ఈ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది.