Minister Harish Rao: మీకు అండగా ఈడీలు, సీబీఐలు ఉండొచ్చు.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు..

వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Minister Harish Rao: మీకు అండగా ఈడీలు, సీబీఐలు ఉండొచ్చు.. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారు..

Minister Harish Rao,

Minister Harish Rao: వరంగల్ విజయసంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎవరు రాష్ట్రానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. మొన్న రాహుల్ వచ్చిన, ఈరోజు మోదీ వచ్చినా తిట్టుడే పని. తెలంగాణ అభివృద్ధిని చూసి వాళ్లు ఓర్వలేక పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణకు అవార్డులు ఇచ్చి.. గల్లీలో తిట్టడం పరిపాటిగా మారింది. తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని ప్రధాని మోదీ సభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మా పథకాలను కాపీ కొట్టినప్పుడు తెలియదా అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతి పథకం పేరును మార్చి కాపీ కొట్టారని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

PM Modi: కేసీఆర్ కుటుంబం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి .. బీజేపీతోనే బంగారు తెలంగాణ సాధ్యం

మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం. మీరు ఎం చేశారంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చాలా నిధులు ఇచ్చామని ప్రధాని చెప్పారు. మీరు డబ్బులు ఇవ్వలేదు.. మాకు రావాల్సిన నిధులు ఆపారు.. మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, నిజంగా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వండి. నీతి అయోగ్ చెప్పినా డబ్బులు ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. బావుల కాడ మీటర్లు పెట్టాలేదనీ 21 వేల కోట్లు ఆపింది మీరుఅంటూ మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

PM Modi Warangal tour: తెలంగాణను అవినీతిమయం చేశారు.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. ప్రధాని మోదీ.. Live Updates

తెలంగాణ అభివృద్ధిని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కళ్ళలో మంటలు లేస్తున్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజన యూనివర్సిటీ ఇవ్వండి. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ యూనిట్ ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. బురద జల్లుడు తప్ప మీరు చేసేందేమి లేదు. ఏమన్నా అంటే ఈడీ ఉపయోగిస్తున్నారు. మీకు ఈడీలు, సీబీఐలు అండగా ఉండొచ్చు. మాకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని హరీష్ రావు అన్నారు.