Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ ఇంకో రీమేక్ సినిమా వద్దు, తేరి సినిమా అయితే అస్సలు వద్దు అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేశారు. దానిపై క్లారిటీ ఇవ్వాలని హరీష్ శంకర్ ని.............

Harish Shankar : పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తున్నారు.. హరీష్ శంకర్ సంచలన కామెంట్స్..

Harish Shankar sensational comments on Pawan Kalyan Fans

Harish Shankar :  పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. కానీ రాజకీయాలకి ఎక్కవ టైం ఇస్తుండటంతో సినిమా షూట్స్ కి టైం ఇవ్వలేకపోతున్నారు. దీంతో పవన్ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయనున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఆయన సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికి తెలిసిందే. అయితే పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా ఒక్కోసారి మితి మీరినట్టు ఉంటుంది. కొన్ని సార్లు పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేడని కొంతమంది ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఇక సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కెరీర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలే చేశాడు. ఇప్పుడు కూడా రీమేక్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమా తమిళ్ తేరి సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ ఇంకో రీమేక్ సినిమా వద్దు, తేరి సినిమా అయితే అస్సలు వద్దు అంటూ సోషల్ మీడియాలో హరీష్ శంకర్ ని టార్గెట్ చేశారు. దానిపై క్లారిటీ ఇవ్వాలని హరీష్ శంకర్ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీనిపై తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా రీమేకా కాదా అనేది నేను చెప్దామనుకున్నాను. కానీ ఫ్యాన్స్ చాలా ఓవర్ చేశారు. కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతిగా రియాక్ట్ అయ్యారు. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వాళ్లకి కూడా తెలుసు. ఫ్యాన్స్ అంటే నాకు తమ్ముళ్లు లాంటి వాళ్ళు. కానీ ఈ సమయంలో మాత్రం కొంతమంది ఫ్యాన్స్ ఎక్కువ చేశారు. అందుకే పవన్ సినిమా రీమేకా కాదా అనేది నేను చెప్పను డైరెక్ట్ రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో చూసుకుంటారు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మరోసారి పవన్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు.

Rajinikanth : మొన్న అమితాబ్, నేడు రజిని.. కోర్ట్‌లో పిటిషన్!

కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్న రచయిత, దర్శకుడు దశరథ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హరీష్ శంకర్-పవన్ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నాను. ఇది తేరి సినిమాకు రీమేక్. అయినా కేవలం మెయిన్ లైన్ మాత్రమే తీసుకొని పూర్తిగా పవన్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే మారుస్తున్నాము. ఇది అభిమానులకి నచ్చుతుంది అని అన్నారు. దీంతో పవన్ – హరీష్ సినిమా రీమేక్ అని మరోసారి క్లారిటీ వచ్చేసింది, నువ్వు చెప్పోద్దులే అంటూ హరీష్ శంకర్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.