Huzurabad By-Election : హుజూరాబాద్ ఉప ఎన్నికలు..నామినేషన్లు వేసేందుకు వందలాదిగా తరలొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. దీంతో హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది.
field assistants nominations : హుజూరాబాద్లో నామినేషన్ రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడం కోసం అభ్యర్ధులు బారులు తీరారు. దీంతో హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద రద్దీ నెలకొంది. నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు లైన్ కట్టారు. అయితే కోవిడ్ నిబంధనలు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ కావాలి అంటూ అధికారులు రూల్స్ పెట్టారు. నామినేషన్ వేయడానికి రూల్స్ అడ్డుపడుతున్నాయి.
ఇక ఇవాళ నామినేషన్ వేయనున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఈటల నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పాల్గొననున్నారు. అటు బల్మూరి వెంకట్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేయనున్నారు. ఆయన నామినేషన్కు పార్టీ పెద్దలు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు.
Huzurabad By-Election : హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు
ఈ నెల 11న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత 4 రోజులుగా నామినేషన్ పత్రాలతో వస్తున్నా తమను అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇవాళ కూడా నామినేషన్ వేసేందుకు ఫీల్డ్ అసిసెంట్లు భారీ ఎత్తున తరలివచ్చారు.