MLa Raja Singh : బీజేపీ నన్ను వదులుకోదు..నేను బీజేపీని వదులుకోను..సస్పెన్షన్ పై వివరణ ఇస్తా

బీజేపీ అధిష్ఠానం ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ అంటే ఎంతో గౌరవం అని మరోసారి స్పష్టంచేశారు రాజాసింగ్. తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇస్తానని, బీజేపీ తనను వదులుకోదని.. భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

MLa Raja Singh : బీజేపీ నన్ను వదులుకోదు..నేను బీజేపీని వదులుకోను..సస్పెన్షన్ పై వివరణ ఇస్తా

Pakistan on Raja Singh's remarks

MLa Raja Singh key-comments on bjp suspensions : బీజేపీ అధిష్ఠానం ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ అంటే ఎంతో గౌరవం అని మరోసారి స్పష్టంచేశారు రాజాసింగ్. తనకు పార్టీ ఇచ్చిన
షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇస్తానని, బీజేపీ తనను వదులుకోదని.. భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే తాను కూడా బీజేపీని వదులుకోనని స్పష్టంచేశారా రాజాసింగ్. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తనకు నమ్మకం ఉందని..నేను ఎవరిని ఉద్ధేశించి వీడియో చేయలేదని వివరించారు.నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని..హిందూ ధర్మానికే తాను కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు రాజాసింగ్.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆయనపై హైదరాబాద్‌‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. నుపుర్ శర్మ వ్యవహారం మాదిరిగానే ఈ ఘటన కూడా తమకు చెడ్డపేరు తెచ్చేలా ఉందని భావించిన బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.

దీనిపై తాజాగా స్పందించిన రాజాసింగ్… వీడియోలో తాను ఎవ్వరిని కించపరచలేదని స్పష్టం చేశారు. బీజేపీ హై కమాండ్ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు త్వరలోనే వివరణ ఇస్తానని..తన వివరణతో పార్టీ సంతృప్తిం చెందుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ తనను వదులుకోదని భావిస్తున్నానని..అలాగే తాను కూడా బీజేపీని వదులుకోదని తాను జీవించి ఉన్నంత కాలం బీజేపీ కార్యకర్తగానే ఉంటానని తెలిపారు.కష్టకాలంతో తనకు అండగా నిలుస్తున్న అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. తనపై నమోదైన కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటానని తెలిపారు రాజాసింగ్.