Monkeypox: దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదు
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు.
Monkeypox: దేశంలో బుధవారం మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియాకు చెందిన 31 ఏళ్ల మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ఢిల్లీలోని నాలుగో కేసు కాగా.. దేశంలో తొమ్మిదో మంకీపాక్స్ కేసు. దేశంలో ఒక మహిళకు మంకీపాక్స్ సోకడం ఇదే మొదటిసారి.
Delivery Boy: తండ్రికి యాక్సిడెంట్.. అతడి స్థానంలో ఫుడ్ డెలివరీ చేస్తున్న ఏడేళ్ల కొడుకు
ఆమెకు జ్వరం, చర్మంపై దద్దుర్లు, మెడ గ్రంథుల వద్ద వాపు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో స్థానిక ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంకీపాక్స్ సోకినట్లు తెలిపారు. అయితే, ఆమె ఎక్కడెక్కడ పర్యటించిందో ఇంకా సమాచారం లేదు. మరోవైపు దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం, మంకీపాక్స్ లక్షణాలతో ఇటీవల ఒక రోగి మరణించడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకీపాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ కొన్ని సూచనలు చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల ప్రకారం.. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను తాకకూడదు.
రోగికి దగ్గరగా ఉండే వాళ్లు శానిటైజర్, హ్యాండ్ వాష్, గ్లోవ్స్, మాస్క్ వంటివి వాడాలి. రోగి ఉపయోగించిన లాండ్రీ, బెడ్షీట్స్, టవల్స్ వంటివి వాడకూడదు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకూడదు. ఈ వ్యాధి గురించి జరిగే అసత్య ప్రచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.