Afghanistan earthquake: అఫ్గానిస్థాన్కు భారత్ సాయం
భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. అఫ్గాన్లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Afghanistan earthquake: భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్కు సాయం చేసేందుకు తాము సిద్ధమని భారత్ తెలిపింది. అఫ్గాన్లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎన్నో ఇళ్లు కూలిపోయి తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ”భూకంప బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. మృతుల పట్ల సంతాపం తెలుపుతున్నట్లు భారత్ కూడా ప్రకటించింది. అఫ్గానిస్థాన్ ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది” అని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు.
Maharashtra: శరద్ పవార్ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజయ్ రౌత్
కాగా, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే అఫ్గాన్కు సాయంగా భారత్ నుంచి సరుకులు పంపామని, అవి కాబూల్ చేరుకున్నాయని తెలిపారు. మిగతా సాయం కూడా త్వరలోనే అందుతుదని వివరించారు. కాగా, అఫ్గాన్కు భారత్ ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు, 13 టన్నుల ఔషధాలు, 5 లక్షల డోసుల కొవిడ్-19 వ్యాక్సిన్లను పంపింది.