Maharashtra: శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజ‌య్ రౌత్

మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మ‌హారాష్ట్ర స‌ర్కారు కుప్ప‌కూలే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ విష‌యంపై శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

Maharashtra: శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నారు: సంజ‌య్ రౌత్

Sanjay Raut

Maharashtra: మహారాష్ట్రలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మ‌హారాష్ట్ర స‌ర్కారు కుప్ప‌కూలే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఈ విష‌యంపై శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

Maharashtra: అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం: ఏక్‌నాథ్‌ షిండే

”ఆయ‌న మ‌హారాష్ట్ర బిడ్డ‌. ఆయ‌న‌ను కొంద‌రు బెదిరిస్తున్నారు. మోదీ జీ, అమిత్ షా జీ మీరు వింటున్నారా? శ‌ర‌ద్ ప‌వార్‌ను మీ మంత్రి బెదిరిస్తున్నారు. ఇటువంటి బెదిరింపుల‌ను మీరు స‌మ‌ర్థిస్తారా? మ‌హారాష్ట్ర తెలుసుకోవాల‌నుకుంటోంది” అని సంజ‌య్ రౌత్ వ్యాఖ్యానించారు. మ‌హా వికార‌స్ అఘాడీ ప్ర‌భుత్వాన్ని కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటారని, రోడ్డుపైనే ఆపేసి ఇంటికి వెళ్ల‌నివ్వ‌బోమ‌ని శ‌ర‌ద్ ప‌వార్‌ను ఓ కేంద్ర మంత్రి బెదిరించార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వం ఉండొచ్చు, కుప్ప‌కూలిపోవ‌చ్చ‌ని, అయితే, ఇటువంటి బెదిరింపులు స‌రికాద‌ని సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా, త‌నకు 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంద‌ని మంత్రి ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. వారిలో 40 మంది శివ‌సేన‌కు చెందిన వారు ఉన్నార‌ని చెప్పారు. దీంతో ప్ర‌భుత్వం ప‌త‌నం అంచుకు చేరుకుంది.