India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే.. ఫొటో గ్యాలరీ
India vs New zealand ODI Series: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ శనివారం రాయ్పుర్లో జరిగింది. ఈ వన్డేలో టీమిండియా కివీస్ను చిత్తుచేసింది. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ తీసుకున్నాడు. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో కివీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. కేవలం గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్ వెల్(22), మిచెల్ శాంటర్న్ (27) రెండంకెల స్కోర్ చేయడంతో న్యూజిలాండ్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. 109 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రాణించారు. దీంతో రోహిత్ శర్మ (51) ఆఫ్ సెంచరీ చేయగా, శుభ్మన్ గిల్ (40 నాటౌట్) రాణించాడు. కేవలం రెండు వికెట్లు (రోహిత్, విరాట్) మాత్రమే కోల్పోయి 20.1 ఓవర్లలో టీమిండియా 111 పరుగులు చేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది.