K Kavitha: రాహుల్ గాంధీ భారత్లోనే ఉన్నారా?: కవిత చురకలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసలు భారత్లోనే ఉన్నారా? అని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఈ నెల 21న తెలంగాణలోని సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ విషయంపై కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎవరైనా నేర్చుకుని, తిరిగి వెళ్ళవచ్చని అన్నారు.
K Kavitha: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసలు భారత్లోనే ఉన్నారా? అని టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఈ నెల 21న తెలంగాణలోని సిరిసిల్లలో రాహుల్ గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఈ విషయంపై కవిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలంగాణలో కొనసాగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చూసి ఎవరైనా నేర్చుకుని, తిరిగి వెళ్ళవచ్చని అన్నారు. అయితే, ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్లోనే ఉన్నారా అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయం గురించి తాము తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు.
Cloudburst: అందుకే సీఎం కేసీఆర్ ‘క్లౌడ్ బరస్ట్’ అన్నారు: ఉత్తమ్ కుమార్రెడ్డి
సిరిసిల్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీ తెలుసుకుని, ఆయన సొంత నియోజక వర్గం వయానాడ్లో వాటిని ప్రారంభించవచ్చని చెప్పారు. అయితే, తనతో పాటు దేశం మొత్తం రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ఆశ్చర్యపోతోందని ఆమె చురకలంటించారు. కాగా, భారీ వర్షాల వేళ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు సాయం అందట్లేదని ఆమె చెప్పారు. కేంద్ర సర్కారు నుంచి తెలంగాణకు ఎటువంటి వరద సహాయ నిధి అందలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు మాత్రం ఆ నిధులు అందుతున్నాయని చెప్పారు.