Jio : జియో స్మార్ట్ఫోన్ ప్రీ బుకింగ్స్.. ఎప్పటి నుంచి అంటే..
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్తో కలిసి
Jio Smart Phone : టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రపంచంలోనే ‘అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్’ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ కోసం అనేకమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్కి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
టెలికాం రంగంలో అత్యధికమంది యూజర్లుతో ప్రథమ స్థానంలో ఉన్న జియో.. యూజర్ల సంఖ్య మరింత పెంచేందుకు ప్లాన్ చేసింది. గ్రామీణ భారతం లక్ష్యంగా గూగుల్తో కలిసి జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.
జూన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కాగా, రూ.3,500 ధరకు ఈ ఫోన్ ని తీసుకుని వస్తున్నట్లు మొబైల్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఫీచర్స్:
* 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
* 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్
* 2/3జీబీ ర్యామ్
* 16/32 జీబీ స్టోరేజ్
* క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
* 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
* 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ