Maharashtra : ఆలయంలో చొరబడ్డ ఉగ్రవాది చెంపలు వాయించిన భక్తుడు .. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన టెర్రరిస్టు..

ఓ దేవాలయంలోకి ఉగ్రవాదులు మారణాయుధాలతో చొరబడ్డారు. భక్తుల తలకు తుపాకి గురి పెట్టి కదిలితే చంపేస్తాం అంటూ బెదిరించారు. అందరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దిక్కులు చూస్తు నిల్చుండిపోయారు. కానీ ఓ భక్తుడు మాత్రం ధైర్యం చేశాడు. తుపాకితో బెదిరిస్తున్న ఉగ్రవాది రెండు చెంపలు పెఢీ పెఢీ వాయించేశాడు. అతని ధైర్యం గొప్పది అంటూ పోలీసులు అభినందించారు..

Maharashtra : ఆలయంలో చొరబడ్డ ఉగ్రవాది చెంపలు వాయించిన భక్తుడు .. సూపర్ ట్విస్ట్ ఇచ్చిన టెర్రరిస్టు..

Maharashtra Temple In Terrarist

Maharashtra Temple In Terrorist : ముసుగులు ధరించి..చేతిలో మారణాయుధాలతో ఎవరైనా కనిపిస్తే అంత దూరం పారిపోతాం. అటువంటి గెటప్ లతో వారు ఉగ్రవాదులుగానే కనిపిస్తారు. అటువంటివారు కనిపిస్తే ఎక్కడ బాంబులు పేలుస్తారో అనే భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరుగు అందుకుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ధైర్యంగా ఉగ్రవాది రెండు చెంపలు ఎడాపెడా వాయించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ప్రాణాలు లెక్కచేయకుండా ‘టెర్రరిస్టు’కు ఎదురెళ్లిన సామాన్యుడి తెగువ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కానీ అసలు ట్విస్టు అక్కడే ఉంది..

మహారాష్ట్ర(Maharashtra)లోని ధూలే (Dhule)ప్రాంతంలో ఎప్పుడు భక్తులతో రద్దీగా ఉండే శ్రీ స్వామి నారాయణ ఆలయంలోకి కొంతమంది దుండగులు వచ్చారు. అంతా ముసుగులు ధరించి ఉన్నారు. వారి చేతిలో ఆయుధాలు కూడా ఉన్నాయి. వచ్చీరావటంతోనే వారిలో ఓ దుండగుడు ఓ భక్తుడి తలపై గన్నుపెట్టి బెదిరింపులకు దిగాడు. ఊహించని ఈ ఘటనకు అందరు బిత్తరపోయారు. హడలిపోయారు. ఇక తమ పని అయిపోయింది వచ్చివాళ్లు ఉగ్రవాదులు అని అందరు ఫిక్స్ అయిపోయారు. ఓ పక్క ప్రాణాలమీద ఆశలు వదిలేసుకుంటునే తప్పించుకునే మార్గం ఏమన్నా ఉందనా అందరు దిక్కులు చూస్తు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని చూస్తుండిపోయారు.

10 years Girl Marriage : పెళ్లి చేయమంటూ 10 ఏళ్ల చిన్నారి మారాం, చేసిన 12 రోజులకే మృతి .. వింత కోరిక వెనుక పెను విషాదం

ఈక్రమంలో అక్కడ ఉన్నవారిలో ఓ వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందడుగు వేశాడు. గన్‌ పెట్టి బెదిరిస్తోన్న దుండగుడిపైకి వెళ్లి..మీకసలు బుద్ధుందా..? అంటూ పెఢీ పెఢీ చెంపలు వాయగొట్టాడు. ఈ హడావిడిలో ధూలేలోని శ్రీ స్వామి నారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు వచ్చారు అంటూ ఎవరో పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది.

దీంతో పోలీసులు ఆఘమేఘాలమీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కూడా ధైర్యంగా ఆలయంలోకి వచ్చి దుండగులను అదుపులోకి తీసుకువచ్చారు. ఏంటీ పోలీసులకు అంత ధైర్యం ఎలా వచ్చింది..? అనుకుంటున్నారా..? అసలు విషయం తెలిసి అక్కడివారు ఎలా ఆశ్చర్యపోయారో మనం కూడా అలాగే ఆశ్చర్యపోతాం.

తుపాకీ శబ్దాలకు వణిపోయిన వారు ఇదంతా పోలీసులు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌లో భాగమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఓరి నాయనో అదే ఏ హార్ట్ ఎటాక్ ఉన్నవారో ఉండి వుంటే వారి పరిస్థితి ఏంటీ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెర్రరిస్టుపైకి దూసుకెళ్లిన ఆ వ్యక్తి పేరు ప్రశాంత్‌ కులకర్ణి అని వెల్లడించారు. తన కుమార్తె ఏడ్వడం వల్లే ఆయన అంత ధైర్యం చేసానని చెబుతున్నాడు. ఏది ఏమైనా అది పోలీసుల మాక్ డ్రిల్ అని తెలియని ఆ వ్యక్తి ఉగ్రవాదులపైకి ధైర్యంగా వెళ్లటం మాత్రం అభినందించాల్సిందే.