Woman Return : మరణించిందని అంత్యక్రియలు చేసిన 11 ఏళ్లకు తిరిగొచ్చింది

జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మానసిక స్థితి సరిగ్గా లేక 11 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. చనిపోయిందని భావించిన ఆమె కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు.

Woman Return : మరణించిందని అంత్యక్రియలు చేసిన 11 ఏళ్లకు తిరిగొచ్చింది

Woman

married woman Returned : జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మానసిక స్థితి సరిగ్గా లేక 11 ఏళ్ల క్రితం అదృశ్యమైంది. చనిపోయిందని భావించిన ఆమె కుటుంబసభ్యులు అంత్యక్రియలు చేశారు. అయితే ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో వెళ్లి తీసుకొచ్చారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ కు చెందిన నర్సయ్య, రెంజర్ల లక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భర్త నర్సయ్య గల్ఫ్‌లో ఉండగా, 11 ఏళ్ల కిందట భార్య లక్ష్మి అదృశ్యమైంది. అప్పటి నుంచీ ఆమె కోసం ఎక్కడ వెతికినా ఫలితం లేదు.

రెండేళ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను చూసి లక్ష్మివేనని భావించి, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. ఇదిలావుంటే మానసిక స్థతి సరిగ్గా లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌ ప్రాంతానికి చేరుకుంది.

అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి ఆమెకు చికిత్స చేయించింది. ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి వెళ్లి లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న ఆమె తిరిగి ఇంటికి చేరడంతో భర్త, కుమార్తెలు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.