Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. మారుమూల అటవీప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్‌ ను డ్రోన్లతో తరలించనుంది.మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ద్వారా..

Medicine From The Sky : దేశంలోనే తొలిసారి తెలంగాణలో డ్రోన్లతో వ్యాక్సిన్ల తరలింపు

Medicine From The Sky

Medicine From The Sky Project Trail Run In telangana: ఈ కరోనా కాలంలో మహమ్మారిని అంతమొందించటానికి పలు చర్యలు తీసుకున్న తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. అదే కరోనా వ్యాక్సిన్‌ డెలివరీ చేయటానికి టెక్నాలజీని ఉపయోగించనుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నగరాల్లో బాగానే జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‌ వేగంగా చేయటానికి డ్రోన్లతో వ్యాక్సిన్లను తరలించేందుకు రెడీ అవుతోంది. ఈ ప్రయోగం తెలంగాణలో సక్సెస్ అయితే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలింపే లక్ష్యంగా మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు
లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. ఇది ఎక్కువ శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే జరుగుతోంది. కానీ మూరుమూల ప్రాంతాలు..ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు వ్యాక్సినేషన్‌ అందటంలేదు. దీనికి కారణం అక్కడకు వెళ్లే దారులు కష్టంగా ఉండటం ఒక్కటే కాదు. వ్యాక్సిన్లు సరైన ఉష్ణోగ్రతల్లో ఉండాలి. అలా ఉంటేనే అవి పాడైపోకుండా ఉంటాయి. కానీ అటవీప్రాంతాలకు చేరుకునే క్రమంలో జరిగే సయమాభావంతో వ్యాక్సిన్లు పాడైపోయే అవకాశముంది. వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో వ్యాక్సిన్లు వేసే రోజునే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లిన వెంటనే వేయాల్సి వస్తోంది. కానీ అన్ని గ్రామాలకు ఇటువంటి అవకాశం లేదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లే సమయాభావం వల్ల వ్యాక్సిన్లు పాడైపోయే ప్రమాదముంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు.

గంట వ్యవధిలోనే వ్యాక్సిన్లు చేరుకునే అవకాశం..
జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టార్టింగ్ పాయింట్‌ నుంచి ఎండింగ్ ఏరియా వరకు కేవలం గంట వ్యవధిలో వ్యాక్సిన్లు చేరుకునేలా చేయనున్నారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు ఆయా గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి.

సెప్టెంబరు 9 నుంచి మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్‌ రన్
మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్‌ లో భాగంగా..గురువారం( 2021 సెప్టెంబరు 9) నుంచి ప్రారంభించనున్నారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్‌ రన్‌ కొనసాగనుంది. ఈ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయితే మెడిసన్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశాలున్నాయి.

మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు తొలిసారిగా వికారాబాద్
మెడిసిన్స్‌ ఫ్రం ది స్కై ప్రాజెక్టు మొదటిసారిగా హైదారాబాద్‌కు సమీపంలో ఉన్న వికారాబాద్‌ జిల్లాను ఎంచుకున్నారు అధికారులు. ఈ జిల్లాలోని 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్‌ రన్‌లో లోటు పాట్లు ఉంటే వాటిని గుర్తించి మరోసారి అలా జరగకుండా చూసుకుంటారు.

కేంద్రం అనుమతి..ప్రారంభించనునన్న తెలంగాణ
డ్రోన్‌ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. దీని కోసం కేంద్రాన్ని అనుమతి కోరగా కేంద్రం అనుమతులు ఇవ్వటంతో ఇక ఆకాశంలో ఔషధాల తరలింపు జరుగునుంది.