MLC Kavitha : మూడోసారి ముగిసిన కవిత ఈడీ విచారణ.. 8గంటలకు పైగా ఎంక్వైరీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది.(MLC Kavitha)

MLC Kavitha : మూడోసారి ముగిసిన కవిత ఈడీ విచారణ.. 8గంటలకు పైగా ఎంక్వైరీ

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో మూడోసారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మూడోసారి ఈడీ విచారణ ముగిసింది. మంగళవారం సుదీర్ఘంగా కవితను విచారించారు ఈడీ అధికారులు. 8 గంటలకు పైగా ఆమెను ఎంక్వైరీ చేశారు. లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసుకి సంబంధించి కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. అటు కవిత ఇచ్చిన 10 ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్నారు ఈడీ అధికారులు.(MLC Kavitha)

Also Read..Delhi Liquor Scam : MLC కవిత 10 ఫోన్లలో ఏముంది? డిలీట్ అయిన డేటాను కూడా రికవరీ చేసే యత్నంలో ఈడీ

ఈడీ కవితను విచారించడం ఇది మూడోసారి. దీంతో సర్వత్రా ఉత్కంఠ కనిపించింది. కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటుందా? అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే, అదేమీ జరగలేదు. కాగా, కవిత ఈడీ విచారణ కొనసాగనుంది. రానున్న రోజుల్లో కవితకు మరిన్ని సమన్లు జారీ చేయబోతున్నారు అని సమాచారం. ఇప్పటికే కవితకు సంబంధించిన వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టిన ఈడీ.. దానికి సంబంధించిన స్టేట్ మెంట్లను ఈడీ తీసుకుంది. మొత్తం 11 ఫోన్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.(MLC Kavitha)

Also Read..Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

ముందస్తుగానే లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ కవిత ఫోన్ లోకి వచ్చిందా? లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి? సౌత్ గ్రూప్ తో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ లో పెట్టుబడులు సహా ఢిల్లీలో లిక్కర్ కంపెనీలకు అనుకూలంగా పాలసీని మార్చడానికి జరిగిన సమావేశంలో కవిత పాల్గొనడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కవితకు మధ్య ఉన్న సంబంధాలు.. కవిత వారిని కలిశారా? వారితో మాట్లాడారా? లిక్కర్ పాలసీకి సంబంధించిన బిజినెస్ ను కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా, ఇతర రాష్ట్రాలకు ఎక్స్ ప్యాండ్ చేయడం.. ఇలా అనేక అంశాలకు సంబంధించి నిందితులు నుంచి స్టేట్ మెంట్స్ ఆధారంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం జరిగింది.(MLC Kavitha)

Also Read..Delhi Liquor Scam : ఈడీ నా ఫోన్లు ఇవ్వమనటం మహిళ స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించటమే : MLC Kavitha

ఇప్పటికే రెండు పర్యాయాలు(మార్చి 11, 20) విచారణకు హాజరైన కవిత, నేడు (మార్చి 21) మూడో దఫా ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాగా, విచారణ మధ్యలో ఈడీ అధికారులు కవిత న్యాయ బృందానికి కబురు పంపారు. దాంతో కవిత న్యాయవాది సోమ భరత్ వెంటనే ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ కోరిన సమాచారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. కాగా, కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు. (MLC Kavitha)

Also Read..Tech Tips in Telugu : మీ ఫోన్ నెంబర్‌కు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? బ్లాక్ చేయాలంటే వెంటనే ఇలా చేయండి.. అన్ని నెట్‌వర్క్‌లకు ఒకటే ఆప్షన్..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈ నెల 11న కవిత తొలిసారిగా ఈడీ విచారణకు హాజరయ్యారు. 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చాక.. 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున, మార్చి 24వరకు తనకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ఈడీని కోరారు. అయినప్పటికీ కవిత అభ్యర్థనను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ మార్చి 20న నోటీసులు ఇచ్చింది. దీంతో 20న రెండోసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు.