Komatireddy RajGopal Reddy : కుట్ర జరుగుతోంది.. బీజేపీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్లారిటీ

కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురికావద్దని ఆయన కోరారు.

Komatireddy RajGopal Reddy : కుట్ర జరుగుతోంది.. బీజేపీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి క్లారిటీ

Komatireddy Raja Gopal Reddy

Komatireddy RajGopal Reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతారని బీజేపీలో చేరతారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్టు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్ల వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారాయన. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని మర్యాద పూర్వకంగా కలిశానని ఆయన చెప్పారు. షాతో సమావేశం అనంతరం అనేక వార్తలు, ఊహాగానాలు వస్తున్నాయన్నారు.

అమిత్ షాని కలవటం కొత్తేమీ కాదని, గతంలోనూ అనేక సార్లు కలిశానని ఆయన వివరించారు. అందరి సమక్షంలోనే తాను అమిత్ షా తో భేటీ కావడం జరిగిందన్నారు. నేను కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ దినపత్రికతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురికావద్దని ఆయన కోరారు.

V. Hanumantha Rao : స్టార్ క్యాంపెయినర్ తమ్ముడే పార్టినుంచి వెళ్లిపోతే ఎలా? వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా అదనంగా కేటాయించని సీఎం కేసీఆర్.. అనేక సంవత్సరాలుగా అడుగుతున్న గట్టుప్పల్ మండలాన్ని వెంటనే ప్రకటించారని చెప్పారు. నాయకులను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారని ఆరోపించారు. భువనగిరి లోక్ సభతో పాటు మునుగోడు శాసనసభ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించకుండా నేను ఏ నిర్ణయం తీసుకునేది లేదని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. అందరితో కలిసి చర్చించిన తర్వాతే కేసీఆర్ కుటుంబం-ఆయన అవినీతి కుటుంబ పాలనపై బహిరంగ యుద్ధ ప్రకటన చేద్దామన్నారు. అది కూడా లక్ష మంది సమక్షంలో చేస్తామన్నారు.

Komatireddy Rajgopal Reddy : బీజేపీ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

తాను అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రతిపాదించిన కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా ఎస్ఎల్ బీసీ సొరంగంతో పాటు, అన్నీ పూర్తయిన బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనులను పక్కనబెట్టిన కేసీఆర్ ఇప్పుడు హడావిడి చేస్తున్న తీరును ప్రజలంతా గమనించాలన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలతో సమానంగా అన్ని విధాలుగా వెనకబడిపోయిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే.. తాను ఏ త్యాగానికైనా సిద్ధమే అన్నారు. కానీ, ఎన్నికలు వస్తేనే నిధులు లేదంటే మాటల మోసాలతో వచ్చే కేసీఆర్ ఆయన టీం సభ్యులను ఎదుర్కొనేందుకు తాను సర్వదా సిద్ధమే అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు. అభిమానులు కేసీఆర్ అండ్ టీం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.