Malli Pelli : రియల్ లైఫ్ కథనే సినిమాగా తీస్తున్న నరేష్.. ‘మళ్ళీ పెళ్లి’ టీజర్‌తో మళ్ళీ షాక్ ఇచ్చిన నరేష్, పవిత్ర

ఇటీవల నరేష్ 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.

Malli Pelli : రియల్ లైఫ్ కథనే సినిమాగా తీస్తున్న నరేష్.. ‘మళ్ళీ పెళ్లి’ టీజర్‌తో మళ్ళీ షాక్ ఇచ్చిన నరేష్, పవిత్ర

Naresh Pavitra Malli Pelli Movie Teaser Released

Malli Pelli :  గత కొన్నాళ్లుగా టాలీవుడ్(Tollywood) లో బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్(Naresh) – నటి పవిత్ర లోకేష్(Pavithra Lokesh). ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. అనంతరం నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది.

నరేష్-పవిత్ర లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా మొదట స్పందించకపోయినా 2023 న్యూ ఇయర్ సందర్భంగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి, ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, లిప్ కిస్ ఇచ్చుకున్న ఓ వీడియోని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నట్టు వీడియో పెట్టినప్పటికీ అదేదో సినిమా అనే భావించారు కొంతమంది. ఇటీవల నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.

Leo Movie : లియో పాన్ ఇండియా వద్దు.. నేను సినిమాలు తీసేది మన ప్రేక్షకుల కోసం మాత్రమే.. విజయ్ వ్యాఖ్యలు

దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూశాక మరోసారి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు నరేష్ లైఫ్ లో జరిగిందే ఈ టీజర్ లో చూపించారు. నరేష్ – పవిత్రతో తిరగడం, నరేష్ మూడో భార్య మీడియా ముందుకి వెళ్లడం, నరేష్ – పవిత్ర హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఇలా నరేష్ రియల్ లైఫ్ లో జరిగిన సన్నివేశాలన్నీ టీజర్ లో చూపించారు. దీంతో ఈ టీజర్ చూసిన వాళ్ళు నరేష్ – పవిత్రల రియల్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని భావిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించింది. ఈ మళ్ళీ పెళ్లి సినిమాని ప్రముఖ దర్శక, నిర్మాత MS రాజు తెరకెక్కిస్తుండగా నరేష్ సొంతంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను మే లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారింది. మరి దీనిపై నరేష్ మూడో భార్య రమ్య స్పందిస్తుందేమో చూడాలి.