Om Raut : వివాదంలో ఆదిపురుష్ టీం.. తిరుమల ఆలయం ముందు కృతికి ముద్దు పెట్టిన ఓం రౌత్.. ఫైర్ అవుతున్న భక్తులు..

కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ నేడు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చాక మీడియాకు ఫొటోలు ఇచ్చారు. అనంతరం ఆలయం నుంచి వెళ్లిపోతుండగా...

Om Raut : వివాదంలో ఆదిపురుష్ టీం.. తిరుమల ఆలయం ముందు కృతికి ముద్దు పెట్టిన ఓం రౌత్.. ఫైర్ అవుతున్న భక్తులు..

Devotees fires on Adipurush Director Om Raut and Kriti Sanon

Kriti Sanon :  ప్రభాస్(Prabhas), కృతి సనన్”(Kriti Sanon) మెయిన్ లీడ్స్ లో రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. నిన్న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహించారు. చిత్రయూనిట్ అంతా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ ఫుల్ సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.

ప్రభాస్ నిన్న ఉదయమే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ నేడు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి బయటకు వచ్చాక మీడియాకు ఫొటోలు ఇచ్చారు. అనంతరం ఆలయం నుంచి వెళ్లిపోతుండగా కృతి సనన్ కోసం ప్రత్యేకంగా కారు వచ్చింది. కృతి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న వాళ్లందరికీ వీడ్కోలు చెప్తూ అందరికి హగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ కి కూడా హగ్ ఇవ్వగా ఓం రౌత్ కృతి సనన్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు.

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అందరికి ఇచ్చినట్టే వీడ్కోలు హగ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకునేవారు కాదేమో కానీ ఓం రౌత్ ముద్దు కూడా పెట్టడంతో అది కూడా పబ్లిక్ గా, ఆలయం దగ్గర్లో పెట్టడంతో పలువురు భక్తులు ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన ఆలయం దగ్గర ఇలాంటి పనులు ఏంటి అని ఓం రౌత్ పై ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొంతమంది మాత్రం వీడ్కోలు చెప్పుకున్నారు ప్రేమగా దాంట్లో తప్పేముందని అని కామెంట్స్ చేస్తున్నారు.

Adipurush : ‘ఆదిపురుష్’ని నైజాంలో రిలీజ్ చేసేది ఎవరో తెలుసా? చాలా మంది పోటీ పడ్డారు.. కానీ..

గతంలో ఆదిపురుష్ సినిమా పలు వివాదాల్లో నిలిచింది. ఇటీవలే సినిమాపై మంచి హైప్ వస్తుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. సినిమాకి ఫుల్ పాజిటివ్ వస్తున్న సమయంలో డైరెక్టర్ ఓం రౌత్, కృతి సనన్ చేసిన పనితో మరోసారి ఆదిపురుష్ వివాదంలో నిలిచింది.