Omicron Threat : మహారాష్ట్రలో టెన్షన్..రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన

Omicron Threat : మహారాష్ట్రలో టెన్షన్..రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

Mumbai

Omicron Threat  దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన డెల్టా కంటే ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్‌లో 50 ముట్యేషన్లు ఉన్నట్టు భావిస్తుండగా.. స్పైక్ ప్రొటీన్‌పే 30కిపైగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు కూడా ఈ వేరియంట్‌పై పనిచేయకపోవచ్చిన అనుమానిస్తున్నారు. ఈ వేరియంట్ అత్యధిక జెనెటిక్ మ్యుటేషన్లు కలిగి ఉండటం, డెల్టా కన్నా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైతే ఒమిక్రాన్‌తో మరణం సంభవించిన దాఖలా లేదు. అయితే ఒమిక్రాన్ స్వభావంపై సరైన అంచనా లేకపోవడంతో.. అది ఎప్పుడు ఎలా విరుచుకుపడుతుందోనన్న భయాందోళన నెలకొంది.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి తిరిగొచ్చిన ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా తేలడం మహారాష్ట్రను టెన్షన్ పెడుతోంది. కేంద్రం ప్రకటించిన రిస్క్​ దేశాల నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు బుధవారం ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఆరుగురిలో ముగ్గురిని ముంబైలోని కల్యాణ్-దోంబివాలీ, మీరా భయందర్ ప్రాంతాల్లో గుర్తించినట్లు పేర్కొంది. నైజీరియా నుంచి వచ్చిన ఇద్దరిని పింప్రి చించ్వాడ్‌లో, మరో వ్యక్తిని పుణేలో గుర్తించినట్లు తెలిపారు. అయితే ఈ ఆరుగురిలో స్వల్ప లేదా అసమ్టిమాటిక్ లక్షణాలున్నాయని,శాంపిల్స్‌‌ను జీనోమ్ సీక్వెన్స్‌ కోసం ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. వారి రిపోర్ట్స్‌లో ఏం తేలుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇక వీరితో కాంటాక్ట్ అయినవారిని గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్​వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్​, ఇజ్రాయెల్‌లతో పాటు మరికొన్ని ఐరోపా దేశాలను కేంద్రం ‘ఎట్​ రిస్క్(ప్రమాదం పొంచి ఉన్న)’ దేశాలుగా గుర్తించింది.

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కేంద్రం తాజాగా వెల్లడించిన కోవిడ్ మార్గదర్శకాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం రిస్క్ జాబితా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకుని, ఫలితాల వచ్చే వరకూ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాలి. నెగెటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. అటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్గదర్శకాల ప్రకారం హైరిస్క్ దేశాల నుంచి వచ్చేవారు నెగెటివ్ వచ్చినా ఏడు రోజులు వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే, గత 15 రోజులుగా అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించారు. ఒకవేళ వీరు తప్పుడు సమాచారం ఇస్తే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.

ALSO READ Walnut Oil : గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించే వాల్నట్ అయిల్..