Parashuram : నేను ఆయన ఫ్యాన్.. అందుకే సర్కారు వారి పాటలో ఆ డైలాగ్ వాడాను..

డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ''నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని. ఆయనను చూస్తే ఒక హీరోలా కనిపిస్తారు. ఆయన వద్దకు..........

Parashuram : నేను ఆయన ఫ్యాన్.. అందుకే సర్కారు వారి పాటలో ఆ డైలాగ్ వాడాను..

Mahesh Babu

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అయితే అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సర్కారువారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే తమన్, కీర్తి సురేష్, గేయ రచయిత అనంత శ్రీరామ్, డైరెక్టర్ పరుశురాం ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇవాళ (మే 7న) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

 

ఇటీవల విడుదలైన ట్రైలర్ లో నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే డైలాగ్ ఉండటంతో దీనిపై చాలా పెద్ద చర్చే జరిగింది. పలువురు దీనిని రాజకీయంగా కూడా చూస్తూ చర్చించారు. అందుకు కారణం ఈ డైలాగ్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ వాడటమే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ ఈ డైలాగ్ పై క్లారిటీ ఇచ్చాడు.

Mohan Juneja : కేజీఎఫ్ నటుడు మృతి.. సంతాపం తెలుపుతున్న కన్నడ సినీ ప్రముఖులు..

డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ”నేను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని. ఆయనను చూస్తే ఒక హీరోలా కనిపిస్తారు. ఆయన వద్దకు ఎవరైనా ఏదైనా సమస్యని తీసుకెళితే నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ భరోసా ఇచ్చేవారు. సర్కారువారి పాట సినిమాలో కూడా అలాంటి ఒక సందర్భం రావడంతో ఈ డైలాగ్ నే వాడాలనుకున్నాను. దీనికి మహేష్ గారు కూడా ఒప్పుకున్నారు” అని తెలిపారు.