bjp: రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్.. బండి సంజయ్కి నోటీసులు
తెలంగాణ ప్రభుత్వ పథకాలను కించపర్చేలా వ్యవహరించారంటూ బీజేపీ నాయకురాలు రాణి రుద్రమతో పాటు దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.
bjp: తెలంగాణ ప్రభుత్వ పథకాలను కించపర్చేలా వ్యవహరించారంటూ బీజేపీ నాయకురాలు రాణి రుద్రమతో పాటు దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న బీజేపీ ఆధ్వర్యంలో నాగోల్, బండ్లగూడలో ‘అమరుల యాది’లో పేరుతో ఓ సభ నిర్వహించారు. ఇందులో తెలంగాణ సీఎం, ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా ఓ నాటకాన్ని ప్రదర్శించారు.
cpi: లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: ‘సీపీఐ’ నారాయణ
దీంతో మంగళవారం రాణి రుద్రమ, దరువు ఏల్లన్నని హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అంతేగాక, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి జిట్టా బాలకృష్ణను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయన బెయిల్పై విడుదల అయ్యారు.