Pooja Hegde : 13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు పూజా హెగ్డే.. మాల్దీవ్స్ లో రచ్చ..

పూజా హెగ్డే ఒక పక్క సినిమాలతో బిజీగానే ఉంటూ మరో పక్క టూర్స్ వేస్తుంది. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ బికినీల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో.......

Pooja Hegde :  13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో కలిసి విహారయాత్రకు పూజా హెగ్డే.. మాల్దీవ్స్ లో రచ్చ..

Pooja Hegde (1)

 

Pooja Hegde :   పూజా హెగ్డే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. వరుస సినిమాలతో వరుస విజయాలు అందుకుంటుంది. వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజా చేతిలో దాదాపు ఆరు సినిమాలు ఉన్నాయి. మరో వైపు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది.

అయితే పూజా హెగ్డే ఒక పక్క సినిమాలతో బిజీగానే ఉంటూ మరో పక్క టూర్స్ వేస్తుంది. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ బికినీల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక తాజాగా మరో సారి టూర్ కి వెళ్ళింది. అయితే ఈ సారి ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకుంది పూజ.

Tollywood : జగన్ తో మీటింగ్ కి పోసాని, ఆలీ ఎందుకు వెళ్లారు??

తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ కి విహార యాత్రకి వెళ్ళింది పూజా హెగ్డే. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. ”13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో విహారయాత్రకు బయటకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ వచ్చింది. ఈ విహార యాత్ర చాలా ముఖ్యం” అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం పూజా మాల్దీవ్స్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.