Prabhas: రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్-K సందడి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్-K’ చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ను రామోజీ ఫిలిం సిటీలో భారీ తారాగణంతో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ముగించేసుకుని, తన నెక్ట్స్ సినిమాల షూటింగ్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్-K అనే రెండు సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు ఈ స్టార్ హీరో.
Project K: బిగ్ స్టార్ క్యాస్టింగ్తో ప్రాజెక్ట్ కే.. పెరిగిపోతున్న అంచనాలు!
అయితే ఇప్పటికే సలార్ షూటింగ్ సగం పూర్తయినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా హైదరాబాద్లో జరుగుతోంది. అయితే తాజా షెడ్యూల్ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్లో హీరో ప్రభాస్తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కూడా పాల్గొంటోంది. అంతేగాక వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..
దీంతో రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ సినిమా సందడి కనిపిస్తుంది. ఇంత మంది ఒకేసారి షూటింగ్లో పాల్గొంటుండటంతో ప్రాజెక్ట్-K సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ మూవీగా దర్శకడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వస్తుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా, ఆయన లుక్స్ ఎలా ఉంటాయా అని డార్లింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను గ్రాండ్ విజువల్గా ప్రొడ్యూస్ చేస్తుండగా, మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది చివరినాటికి రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.