KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్

ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు.

KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్

Ka Paul

KA Paul criticized : బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ముదురుతున్న ఫ్లెక్సీ వార్ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ. పాల్ ప్రెస్ మీట్ లో కేసీఆర్, మోదీ బైబై అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ స్థాయి మీటింగ్స్ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కరినొక్కరు బైబై చెప్పుకుంటున్నారని కేఏ.పాల్ అన్నారు.

ఒకరు దేశాన్ని దోచుకుంటుంటే..మరొకరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీకీ పెద్ద తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే అని విమర్శించారు. అవినీతి సొమ్ముతో పోటాపోటీగా ఇరు పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు.

KA Paul On Agnipath : దేశం మండిపోతోంది, కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది-కేఏ పాల్ ఫైర్

కేసీఆర్, మోదీకి బైబై చెప్పేందుకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశానని తెలిపారు. బీజేపీ పార్టీ జాతీయ స్థాయి సమావేశాల సందర్భంగా మోదీ హైదరాబాద్ రావచ్చన్నారు. ఎవరు.. ఎక్కడికైనా రావచ్చు.. ఎవరు ఎక్కడికైనా వెళ్లోచ్చన్నారు.