PM Modi : ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.

PM Modi : ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

Muchintal 11zon

Prime Minister Modi arrives in Muchinthal : ప్రధాని మోదీ ముచ్చింతల్ చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ముచ్చింతల్ చేరుకున్నాడు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పీఎం పాల్గొననున్నారు. యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి సత్య సంకల్పంతో.. దివ్య సాకేతంలో రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేయనున్నారు.

ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ… అనంతరం యాగశాలకు చేరుకున్నారు. అక్కడ విశ్వక్సేన ఇష్టి పూర్ణాహుతిలో పాల్గొంటారు. మన అభీష్టాలను నెరవేర్చేందుకు కోసం విశ్వక్సేన ఇష్టి నిర్వహిస్తారు.. ప్రధాని చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలన్న సంకల్పంతో ఈ విశ్వక్సేన ఇష్టిని నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ.

PM Modi : వ్యవసాయాన్ని అందరికీ ఉపయోగకరంగా చేయడంలో ఇక్రిశాట్ సక్సెస్ : ప్రధాని మోదీ

విశ్వక్సేన ఇష్ఠి అనంతరం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చుట్టూ నిర్మించిన 108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత రామానుజాచార్య స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకోని సమతామూర్తి విగ్రహం వద్దకు చేరుకుంటారు. అక్కడే భగవత్‌రామానుజాచార్యుల మహావిగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించనున్నారు. సమతామూర్తి లేజర్‌ షోను తిలకించి విగ్రహాన్ని లోకార్పణం చేయనున్నారు ప్రధాని మోదీ.

సహస్రాబ్ది ఉత్సవాల్లో 1035 హోమగుండాల్లో దివ్యంగా జరుగుతున్న శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతికి మోదీ హాజరవుతారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత 5 వేల మంది రుత్విజులు మోదీకి ఆశీర్వచనాలు అందిస్తారు. 8 గంటలకు భవ్యధామంలో ప్రధాని మోదీ పర్యటన ముగుస్తుంది. అనంతరం శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయల్దేరతారు.