West Bengal : కదులుతున్న రైల్లో నుంచి దూకిన ఇద్దరు మహిళలు.. పరుగెత్తుకెళ్లి ప్రాణాలు కాపాడిన రైల్వే ఎస్సై
పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. కదులుతున్న రైల్లో నుంచి మహిళలు కిందికి దూకారు.
Railway SI rescues two women : పశ్చిమబెంగాల్లో రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళల ప్రాణాలను ఓ రైల్వే ఎస్సై కాపాడారు. లేదంటే క్షణాల్లో వారు ప్రాణాలు కోల్పోయేవారు. పురులియా రైల్వే స్టేషన్లో కదులుతున్న రైల్లో నుంచి దూకి ఇద్దరు మహిళలు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు.
ఆనంద్ విహార్ ఎక్స్ప్రెస్లో ఎక్కిన ఇద్దరు మహిళలు… తమ వారు రైలు ఎక్కలేదనే ఉద్దేశంతో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ప్లాట్ఫామ్ పైకి దూకారు. మొదట ఒక మహిళ కిందకు దూకి ప్లాట్ ఫామ్ పై పడిపోయింది.
Uttar Pradesh : ఎంత నాణ్యతో..!? : ఓపెనింగ్ రోజు టెంకాయ కొడితే పగిలిన కొత్త రోడ్డు
మరో మహిళ కూడా కిందకు దూకడంతో.. ప్లాట్ ఫామ్కు, రైలుకు మధ్య పడిపోయింది. దీంతో అప్రమత్తమైన రైల్వే ఎస్సై బబ్లూ కుమార్ పరుగెత్తి.. ఆమె ప్రాణాలు కాపాడారు.