Ramaprabha : శరత్ బాబు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రమాప్రభ.. వాళ్లందరికీ ఇండైరెక్ట్ గా కౌంటర్లు..

రమాప్రభ ప్రయాణం అంటూ ఎప్పట్నుంచో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఇందులో పలు వీడియోలు అప్పుడప్పుడు పెడుతుంది. తాజాగా మూడు నెలల తర్వాత మళ్ళీ వీడియో పెట్టింది రమాప్రభ. ఈ వీడియోలో అనేక అంశాలపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా పలువురికి కౌంటర్లు వేసింది.

Ramaprabha : శరత్ బాబు మరణం తర్వాత మొదటి సారి మాట్లాడిన రమాప్రభ.. వాళ్లందరికీ ఇండైరెక్ట్ గా కౌంటర్లు..

Ramaprabha first time speaking after sharath babu passes away

Ramaprabha :  ఇటీవల సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి తెలిసిందే. శరత్ బాబు మరణంతో ఆయన మాజీ భార్య రమాప్రభ కూడా వార్తల్లో నిలిచింది. రమాప్రభ, శరత్ బాబు పెళ్లి, విడిపోవడం ఇప్పటికి చాలా మందికి ఒక మిస్టరీనే. దీంతో శరత్ బాబు మరణం తర్వాత రమాప్రభపై అనేక వార్తలు వచ్చాయి. తాజాగా శరత్ బాబు మరణం తర్వాత రమాప్రభ మొదటిసారి మాట్లాడింది.

రమాప్రభ ప్రయాణం అంటూ ఎప్పట్నుంచో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఇందులో పలు వీడియోలు అప్పుడప్పుడు పెడుతుంది. తాజాగా మూడు నెలల తర్వాత మళ్ళీ వీడియో పెట్టింది రమాప్రభ. ఈ వీడియోలో అనేక అంశాలపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా పలువురికి కౌంటర్లు వేసింది.

రమాప్రభ మాట్లాడుతూ.. గత కొన్నాళ్ల నుంచి నా గురించి మాట్లాడుతున్నారు. సినిమాలకి దూరంగా ఉన్నా నా గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక విధంగా నేను ఈ మధ్య పాపులర్ అవుతున్నాను. నా మీద వస్తున్న వార్తలు చూసి ఒక్కోసారి జాలేస్తుంది, బాధగా ఉంది, నవ్వు వస్తుంది. నా ప్రాప్తం అంతే అనుకుంటాను. ఇటీవల రాసిన కొన్ని వార్తలు చూసి మాట్లాడాలనిపించింది. నాకు చెన్నైలో ఓ ఇల్లు ఉంది. అది నా ఇల్లు అని అందరికి తెలుసు. ఇప్పుడు నా ఇంట్లో ఉన్న వాళ్ళు అది నా ఇల్లు అని చెప్పట్లేదు. వేరే వాళ్ళ ఇల్లు అని చెప్తే నవ్వొచ్చింది. నేను అనుమతి ఇస్తే నా ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాధగా ఉంది అని తెలిపింది. అయితే ఇది శరత్ బాబు ఉన్న ఇల్లే అని, శరత్ బాబు చుట్టాల మీదే కౌంటర్ అని భావిస్తున్నారు.

Amitabh And Jaya Bachchan : అమితాబ్-జయా బచ్చన్‌ల వైవాహిక జీవితం చక్కగా ఉండటం వెనుక రహస్యం చెప్పిన శ్వేతా బచ్చన్

అలాగే.. ఎవరెవరో ఏదేదో వార్తలు రాశారు. రమాప్రభ అయ్యో పాపం అని రాశారు, పాపం అన్నారు. నా మీద వార్తలు రాసేవారికి వాళ్ళకి అదే ఉపాధి, డబ్బుల కోసం నన్ను, నా పేరుని వాడుకుంటున్నారు. నా వల్ల బాగుపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నా పేరు చెప్పరు. నేను 13 ఏళ్ళ నుండే సంపాదిస్తున్నాను. కొంతమంది నేను దీన స్థితిలో ఉన్నానని, కొంతమంది సహాయం చేశారని, రజినీకాంత్ సహాయం చేసాడని రాశారు. నాకు ఎవ్వరూ సహాయం చేయాల్సిన అవసరం లేదు, నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు, నేను అడగలేదు. నన్నే చాలా మంది అడిగేవాళ్ళు డబ్బులు. రజినీకాంత్ ని అడుగుదామనిపించింది ఈ వార్తలు చూశావా అని. నా మీద ఎవరు, ఏమి అనుకున్న నేను పట్టించుకోను. నా మీద చాలా మందికి ఈర్ష, అసూయా, ఈగో ఉంది. నా మీద ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చినా నాకు సపోర్ట్ చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు, వారికి రుణపడి ఉంటాను. ప్రస్తుతం నేను చాలా ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని తెలిపింది. దీంతో రమాప్రభ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మీడియాపై, శరత్ బాబు చుట్టాలపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.