Rana Daggubati : అలా అనే వాళ్ళ కోసమే ఈ సినిమా చేశాను..

రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రతీ పాత్రకి......................

Rana Daggubati : అలా అనే వాళ్ళ కోసమే ఈ సినిమా చేశాను..

Rana Daggubati

Rana Daggubati :  రానా, సాయి పల్లవి జంటగా, ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 17న రిలీజ్ అవుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. మొదట్నుంచి కూడా సినిమా అంతా సాయి పల్లవి చుట్టే తిరుగుతుందని, సాయి పల్లవి మెయిన్ లీడ్ అని డైరెక్టర్, హీరో చెప్తున్నారు. ట్రైలర్ చూసిన వారికి కూడా ఇది అర్థమైపోతుంది.

తాజాగా విరాట పర్వం ఆత్మీయ వేడుక అంటూ వరంగల్ లో భారీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Sai Pallavi : మీ ప్రేమని ఎలా తిరిగివ్వాలి..

ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘ఒక కథ ఒక మనిషిని మార్చుతుందా అంటే కచ్చితంగా మనం చేసే కథ మనల్ని మారుస్తుందని చెబుతాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రతీ పాత్రకి సంబంధించిన ఏదో ఒక అంశం నాలో ఉంది. రవన్న పాత్ర కూడా నాలో పెద్ద భాగమైంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు? యాక్షన్‌ సినిమా చేయొచ్చు కదా అని చాలా మంది నన్ను అడిగారు. మనం చాలా సినిమాలు అభిమానుల కోసం, ప్రేక్షకుల చప్పట్ల కోసం చేస్తుంటాం. ఆ చప్పట్ల మధ్యలో నిశ్శబ్దంగా కూర్చుని సినిమా చూసి ఇది నిజమే కదా అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. కథతో కనెక్ట్ అవుతారు. అలాంటివాళ్ల కోసం ఈ సినిమా చేశాను. తెలంగాణాలో కట్టెపుల్లని పట్టుకున్నా కవిత్వం వస్త్తుందని చెప్పారు. అది నిజం. ఇలాంటి తెలంగాణ కథలు ఇంకా చేస్తాం.’’ అని తెలిపారు.