Traffic E-Challans : పెండింగ్ ట్రాఫిక్ చాలానాల ద్వారా రూ. 112.98 కోట్లు ఆదాయం
తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
Traffic E-Challans : తెలంగాణ పోలీసు శాఖ పెండింగ్ ఈ చలానాలు చెల్లింపుకు ఇచ్చిన రాయితీ సత్ఫలితాలను ఇస్తోంది. ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ తో ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నిధులు వచ్చాయి.
మార్చి1 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధి లో 1.2 కోట్లు చలాన్ లు క్లియర్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 112.98 కోట్ల ఆదాయం వచ్చింది.
Also Read : Booster Dose: బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్పై కేంద్రం ఫోకస్
హైదరబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లో ఇప్పటి వరకు 63 లక్షల చలాన్ లు క్లియర్ కాగా.. వీటి ద్వారా రూ.49.6 కోట్లు వాహాన దారులు చెల్లించారు. సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియర్ కాగా వీటి ద్వారా రూ.45.8 కోట్లు ఆదాయం వచ్చింది.ఇక రాచకొండ కమీషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్ లు క్లియర్ కాగా రూ. 15.3 కోట్లు ఆదాయం లభించింది.