Revanth Reddy : అధికారంలోకి వస్తే.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, రూ.2లక్షలు రుణమాఫీ-రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Revanth Reddy : అధికారంలోకి వస్తే.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు, రూ.2లక్షలు రుణమాఫీ-రేవంత్ రెడ్డి

Revanth

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ.500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Also Read..Adilabad Lok Sabha Constituency : రాజకీయాలకు అడ్డాగా కుమ్రం భీమ్ పోరుగడ్డ… అదిలాబాద్ పై కన్నేసిన కమలం

ప్రతీ ప్రాంతంలో ఒక గొప్ప పవిత్ర స్థలం ఉంటుందన్న రేవంత్.. కరీంనగర్ లో అలాంటి గొప్ప పవిత్ర స్థలం అంబేద్కర్ స్టేడియం అన్నారు. 60ఏళ్ల ఆకాంక్షను గౌరవించి 2004లో ఇదే గడ్డపై తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. వేములవాడ, కొండగట్టు పుణ్య క్షేత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకు అంతే ప్రాధాన్యత ఉందన్నారు. మాట తప్పక మడమ తిప్పక.. సోనియా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని అన్నారు. ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవరిపాలైందో మీరు ఆలోచన చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Also Read..Telangana : కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మ, సీబీఐ తోలుబొమ్మ.. అవి ఈడీ సమన్లు కావు మోదీ సమన్లు : కేటీఆర్

కేసీఆర్.. ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? తెలంగాణ ఉద్యమకారులకు, నిరుద్యోగులకు ఈ వేదికగా ప్రశ్నిస్తున్నా.. ఇక్కడ ఎంపీలుగా గెలిచిన కేసీఆర్, తన కుటుంబం కరీంనగర్ కు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్ ను గెలిపిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జైపాల్ రెడ్డి చొరవతో, వ్యూహంతో ఆనాడు తెలంగా రాష్ట్రం ఏర్పడింది. తల్లిని చంపి పిల్లను బతికించారని మోదీ అవహేళన చేశారు. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేని బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదు.

Also Read..Kavitha Protest In Delhi: కవితకు పోటాపోటీగా.. హైదరాబాద్, ఢిల్లీలో బీజేపీ దీక్షలు.. పూర్తి వివరాలు ఇవిగో

ఇక్కడ గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారు? కేసీఆర్ పదే పదే తెలంగాణ మోడల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ అంటే తాగుబోతుల తెలంగాణనా? కేసీఆర్ వచ్చాక 3వేల వైన్ షాపులు.. 60వేల బెల్టు షాపులు వచ్చాయి. కేసీఆర్ చెప్పిన తెలంగాణ మోడల్ ఇదేనా? కేసీఆర్ పై కోపంతో బీజేపీ వైపు చూస్తే… పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే.. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలి. తెలంగాణ మోడల్ కావాలో.. ఛత్తీస్ ఘడ్ మోడల్ కావాలో ఆలోచన చేయండి. ఎవరి చేతిలో పెడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి” అని రేవంత్ రెడ్డి అన్నారు.