Road Accdient: వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది.
Road Accdient: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు నుంచి వరంగల్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.