Samantha : ముగ్గురు ముగ్గురే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన హీరోయిన్స్..

సమంత, రష్మిక, పూజా హెగ్డే.. ఈ ముగ్గురు సౌత్ లో పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి చూస్తున్నారు. ఈ ముగ్గురికి బాలీవుడ్ పిలిచి మరీ ఆఫర్స్..........

Samantha : ముగ్గురు ముగ్గురే.. బాలీవుడ్‌ని టార్గెట్ చేసిన హీరోయిన్స్..

Pooja Hegde

Pooja Hegde :  తెలుగు సినిమాలనే కాదు, టాలీవుడ్ తో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లనూ దగ్గరకు తీస్తున్నారు బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్. సమంత, రష్మిక, పూజా హెగ్డే.. ఈ ముగ్గురు సౌత్ లో పాపులారిటీ తెచ్చుకొని ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయడానికి చూస్తున్నారు. ఈ ముగ్గురికి బాలీవుడ్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తుంది. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేజిక్కించుకుంటున్నారు.

సమంత ఫ్యామిలీ మ్యాన్ 2తో హిందీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా ఊ అంటావా మామా సాంగ్ తో నార్త్ ఆడియన్స్ కి ఫేవరేట్ హీరోయిన్ అయింది. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా ఆయుష్మాన్ ఖురానాతో హిందీ డెబ్యూ మూవీ చేయబోతోంది. ఈ ఇయర్ ఎండ్ లో ఈ సినిమా సెట్స్ మీదకెళ్లి, 2023 ఇయర్ ఎండ్ వరకు రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. అదే కాక సమంత.. కరణ్ జోహార్ తర్వాత ప్రాజెక్ట్ లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. వీటితో పాటు రెండు సిరీస్ లు కూడా ఓకే చేసుకుంది సామ్.

రష్మిక కు తెలుగులో పాపులారిటీ వచ్చిన తర్వాత హిందీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. పుష్పతో నార్త్ ఆడియన్స్ కు దగ్గరైన రష్మిక ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను, అమితాబచ్చన్ తో కలసి గుడ్ బై, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలోనూ రష్మిక కీలక పాత్రలో నటించనుంది.

Manirathnam : పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలి అవుతుందా??

పూజాహెగ్డే మొహంజదారో సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ నిలబడలేదు. తెలుగులో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిన తర్వత బాలీవుడ్ స్టార్స్ ఫోకస్ పూజా పైన పడింది. రాధేశ్యామ్ తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన పూజా హెగ్డేను సల్మాన్ ఖాన్ కబీఈద్ కబీ దివాలి సినిమాకి సెలక్ట్ చేసుకున్నాడు. ఇంకా షారూక్ ఖాన్, రణవీర్ సింగ్, వరుణ్ ధావన్, దీపికా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి భారీ మల్టీస్టారర్ సర్కస్ లో పూజా హెగ్డే నటిస్తోంది. ఇలా టాలీవుడ్ లో పాపులారిటీ సంపాధించుకుని, బాలీవుడ్ లో బ్రేక్ తీసుకోవాలని చూసే హీరోయిన్స్ కి ఇప్పుడు మంచి టైమ్ వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఈ ముగ్గుర్ని చూసి మిగిలిన హీరోయిన్స్ కూడా బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతున్నారు.