Security Guard : రోగికి ఇంజెక్షన్ ఇచ్చిన సెక్యూరిటీ గార్డు.. వైరల్ ఫోటో
ఆసుపత్రికి వచ్చిన రోగికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Security Guard : ఆసుపత్రికి వచ్చిన రోగికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని అంగుల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో ఓ వ్యక్తి వచ్చాడు. అతడికి ఆసుపత్రికి సెక్యూరిటీ ఇంజక్షన్ ఇచ్చాడు.
ఈ దృశ్యాలను రోగి బంధువులు తమ ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఇక ఇదే అంశంపై స్థానికులు, రోగి బంధువులు అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ మానస్ రంజన్ బిశ్వాల్ ప్రశ్నించారు.
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రంజన్ బిశ్వాల్.. సెక్యూరిటీ గార్డ్ ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సమయంలో ఎవరూ ఇంచార్జిగా ఉన్నారో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.