Maha Samudram: షూటింగ్ పూర్తి.. సిద్దూ ఆశలన్నీ శర్వా పైనే!

యంగ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కలిసి నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. RX 100తో టాలీవుడ్ లో పేరు మ్రోగిన దర్శకుడు అజయ్ భూపతి చాలా కాలం విరామం తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. అను ఇమ్మానుయేల్, అదితిరావు హైదరీలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మీద సిద్దార్ధ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Maha Samudram: షూటింగ్ పూర్తి.. సిద్దూ ఆశలన్నీ శర్వా పైనే!

Maha Samudram (1)

Maha Samudram: యంగ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కలిసి నటించిన మహాసముద్రం సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. RX 100తో టాలీవుడ్ లో పేరు మ్రోగిన దర్శకుడు అజయ్ భూపతి చాలా కాలం విరామం తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. అను ఇమ్మానుయేల్, అదితిరావు హైదరీలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మీద సిద్దార్ధ చాలా ఆశలే పెట్టుకున్నాడు. సిద్దూకు చాలాకాలంగా సరైన సక్సెస్ లేదు. పైగా ఎనిమిదేళ్లలో సిద్దూ తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. గృహం పేరుతో తెరకెక్కిన ఈ మల్టీలాంగ్వేజ్ సినిమా కూడా ఆదరణ నోచుకోలేదు.

బావా, ఓ మై ఫ్రెండ్, జబర్దస్త్ లాంటి సినిమాలు విజయాల సంగతెలా ఉన్నా సిద్దూ మార్క్ సినిమాలగా పేరైతే దక్కింది. ఆ తర్వాత క్రమేపీ తెలుగుకు దూరమైన సిద్దార్ధ్ మహాసముద్రంతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక శర్వానంద్ వరస సక్సెస్ లతో జోష్ మీదున్నాడు. గత ఏడాది వచ్చిన జాను, ఈ ఏడాది శ్రీకారంతో విజయాలు దక్కించుకున్న శర్వా ప్రస్తుతం రీతూవర్మ జోడీగా మరో మల్టీలాంగ్వేజ్ సినిమాతో పాటు ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే తెలుగు సినిమా కూడా చేస్తున్నాడు.

దీంతో సక్సెస్ ట్రాక్ మీదున్న శర్వాతో పాటు తొలి సినిమాతోనే భారీ సక్సెస్ దక్కించుకున్న అజయ్ భూపతి మీద సిద్దార్ధ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ అను ఇమ్మానుయేల్ పరిస్థితి కూడా అంతే. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే లుక్ టీజర్స్ ఈ సినిమా మీద అంచనాలను పెంచేయగా త్వరలోనే ట్రైలర్ కూడా విడుదల కానుంది. కరోనా పరిస్థితి చక్కబడితే ఏ క్షణమైనా మహాసముద్రం థియేటర్లలోకి వచ్చేయనుంది. మరి ఈ సినిమా ఎంతవరకు కలిసి వస్తుందో చూడాల్సిఉంది.