Rana Daggubati : శింబు ‘మానాడు’ సినిమాని రీమేక్ చేయబోతున్న రానా

 తమిళ హీరో శింబు ఇటీవల 'మానాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాని తర్వాత తెలుగులో.......

Rana Daggubati : శింబు ‘మానాడు’ సినిమాని రీమేక్ చేయబోతున్న రానా

Rana

Rana Daggubati :  తమిళ హీరో శింబు ఇటీవల ‘మానాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాని తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. ఈ సినిమాపై శింబుకి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్‌ నటించింది.

Anushka Sharma : ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’‌.. మహిళా క్రికెటర్ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో అనుష్కశర్మ

తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు ప్రకటించారు. సురేష్‌ ప్రొడక్షన్స్ ఈ సినిమా రీమేక్‌ హక్కులతో పాటు, అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ ని కొనుక్కున్నారని తెలిపారు. అయితే ఈ సినిమాని తెలుగులో రానాతో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తన సొంత బ్యానర్ లోనే ఈ సినిమా రానా హీరోగా తెరకెక్కబోతుంది అని సమాచారం. అయితే దర్శకుడిగా తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి.