Simbu: వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు.. ఇబ్బంది పెడుతున్నదెవరు?

తమిళ నటుడు శింబు వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. తన చుట్టూ సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Simbu: వేదికపై కన్నీరు పెట్టుకున్న శింబు.. ఇబ్బంది పెడుతున్నదెవరు?

Simbu

Simbu: తమిళ నటుడు శింబు వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. తన చుట్టూ సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. శింబు ఒకనాడు భారీ సక్సెస్ సినిమాలతో టాప్ హీరోలకు సైతం టెన్షన్ పెట్టించగా ఈ మధ్య కాలంలో కాస్త అపజయాలతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తిరిగి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు శతవిధాలా కృషి చేస్తున్న శింబు ప్రస్తుతం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Aha-Netflix: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!

శింబు అభిమానులు, సినీజనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శిని కథానాయిక కాగా.. ఎస్‌జే సూర్య, ప్రేమ్‌జీ, ఎస్‌ఏ చంద్రశేఖర్‌ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శింబు ముందుగా ఉత్సాహంగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూనే ఒకదశ దాటేసరికి భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

Sandeepa Dhar: సొగసుల సంపద సందీప సొంతం!

వెంకట్‌ప్రభుతో కలిసి ఎప్పుడో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పుడు ఇలా కుదిరిందని చెప్పిన శింబు మనాడు సినిమాలో వినోదానికి ఏమాత్రం కొదవుండదని చెప్పాడు. ఈ సినిమా కోసం పడిన శ్రమను మాటల్లో చెప్పలేనని.. ఈ సినిమా విడుదలయ్యాక ఎస్‌ఏ సూర్య మరో స్థాయికి వెళ్తారనడంలో సందేహం లేదన్నాడు. అలా మాట్లాడుతూనే శింబు తన చుట్టూ చాలా సమస్యలను సృష్టిస్తున్నారని.. వాటన్నింటినీ నేను చూసుకోగలని.. నన్ను మాత్రం అభిమానులు చూసుకోండని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో వేదికపై ఉన్న వారు ఆయన్ను ఓదార్చారు. అయితే.. శింబును ఇబ్బంది పెడుతున్న వాళ్లెవరన్నది హాట్ టాపిక్ గా మారింది.