Sukumar : వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్

'పుష్ప' సినిమాతో సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు. ఆ తర్వాత 'పుష్ప 2'తో మన ముందుకి రానున్నాడు........

Sukumar :  వరుస పాన్ ఇండియా లైనప్‌తో సుకుమార్

Sukumar

Sukumar :  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒకప్పుడు లవ్ సినిమాలు చేసేవాడు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా మాస్ కి మారి ఇప్పుడు ఊర మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే అల్లుఅర్జున్ తో ‘పుష్ప’ అనే సినిమాని రిలీజ్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. భారీ కలెక్షన్స్ ని సాధించింది ఈ సినిమా. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నట్టు ముందే చెప్పారు. దీంతో ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప పార్ట్ 2’ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.

‘పుష్ప’ సినిమాతో సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు. ఆ తర్వాత ‘పుష్ప 2’తో మన ముందుకి రానున్నాడు. కరోనా తగ్గు ముఖం పట్టి అన్నీ అనుకున్నట్లు జరిగితే పుష్ప పార్ట్ 2 ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా తీయబోతున్నాడు. విజయ్ దేవరకొండ సినిమా 2023లో ఉండబోతుందని ఇటీవల విజయ్ ట్వీట్ చేశాడు. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమా ఇప్పటికే ఓకే చేసినట్టు సమాచారం. రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల తర్వాత సుకుమార్ తో చేయనున్నట్లు ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లో తెలిపాడు.

Rajashekar : ‘గరుడవేగ’ సినిమాకి సీక్వెల్ చేసే ప్లాన్‌లో ఉన్నాను

ఇలా సుకుమార్ ప్రస్తుతం మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాత మళ్ళీ మహేష్ కి కథ చెప్పాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తానికి సాఫ్ట్ లవ్ స్టోరీలు పక్కన పెట్టి ఊర మాస్ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు ఈ లెక్కల మాస్టారు.