Tamil Nadu: శశికళ మా పార్టీలో చేరొచ్చు: బీజేపీ
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మళ్లీ ఏఐఏడీఎంకేలో చేరతారని ప్రచారం జరుగుతోన్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మేల్యే నాయినర్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మళ్లీ ఏఐఏడీఎంకేలో చేరతారని ప్రచారం జరుగుతోన్న వేళ ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మేల్యే నాయినర్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శశికళను బీజేపీలోకి ఆహ్వానించేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఒకవేళ శశికళను ఏఐడీఎంకే చేర్చుకోకపోతే ఆమె బీజేపీలో చేరవచ్చని అన్నారు. చిన్నమ్మను ఏఐఏడీఎంకే చేర్చుకుంటే ఆ పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు.
Asaduddin Owaisi: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఏఐఎంఐఎం
కాగా, తాను ఏఐఏడీఎంకేలో కొంతమంది మాత్రమే తన రాకను వ్యతిరేకిస్తున్నారని శశికళ ఇటీవలే తెలిపారు. ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని పార్టీ క్యాడరే నిర్ణయిస్తుందని ఆమె అన్నారు. అయితే, శశికళ తిరిగి ఏఐఏడీఎంకేలో చేరే అవకాశం లేదని ఆ పార్టీ జాయింట్ కోఆర్డినేటర్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి అన్నారు. శశికళ ఏఐఏడీఎంకేలో చేరే విషయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.