Asaduddin Owaisi: రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఏఐఎంఐఎం

Asaduddin Owaisi: రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఏఐఎంఐఎం

Asadudding Owaisi

Asaduddin Owaisi: హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నుంది. వ‌చ్చే ఏడాది డిసెంబ‌రులో రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని అస‌దుద్దీన్ ఒవైసీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. త‌మ పార్టీ రాజ‌స్థాన్‌లో కోర్ క‌మిటీని ఏర్పాటు చేస్తుంద‌ని అస‌దుద్దీన్ తెలిపారు. పొత్తుల‌తో పోటీ చేసే అంశంపై స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు.

Congress: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో సోనియా, రాహుల్‌కు స‌మ‌న్లు

అయితే, కాంగ్రెస్‌, బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకోబోమ‌ని చెప్పారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివ‌ని విమ‌ర్శించారు. ఆ రెండు పార్టీల తీరులో తేడాలేమీ లేవ‌ని అన్నారు. బీజేపీకి ఏఐఎంఐఎం బీ-టీమ్ అంటూ కాంగ్రెస్ చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. ఇటువంటి ఆరోప‌ణ‌లు చేస్తూ కాంగ్రెస్ నేత‌లు త‌మలోని నిరాశ‌ను బ‌య‌ట‌పెట్టుకుంటున్నార‌ని అన్నారు.