Telangana Corona : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా 82 కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి (Telangana Corona) అదుపులో ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..

Telangana Corona : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా 82 కేసులు

Telangana Corona Cases

Telangana Corona : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 17,022 కరోనా పరీక్షలు నిర్వహించగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 29 కొత్త కేసులు వచ్చాయి. అదే సమయంలో 311 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోసారి రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. Telangana Corona

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,758 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,83,937 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 1,710 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 123 కరోనా కేసులు నమోదయ్యాయి.

అటు దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రోజువారీ కేసులు నిన్నటితో పోల్చితే ఇంకాస్త తగ్గి.. ఐదున్నర వేలకు దిగొచ్చాయి. ఇక మరణాలు కూడా భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 9,09,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,476 మందికి పాజిటివ్ గా వచ్చింది. మరో 158 మంది కోవిడ్ తో చనిపోయారు. క్రితం రోజు కరోనా మరణాల సంఖ్య 289గా ఉంది. దేశంనలో ఇప్పటివరకూ నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 5,15,036కి చేరింది.

Telangana : హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు.. ఒక్క క్లిక్‌‌తో ఆరోగ్య సమాచారం

గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 9వేల 754 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.23 కోట్లు దాటింది. ఆ రేటు 98.66 శాతానికి పెరిగింది. ఇక యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 59,442కి తగ్గి.. ఆ రేటు 0.14 శాతానికి క్షీణించింది. నిన్న 26,19,778 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 178 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్రం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తగ్గింది. కేసులు దిగివచ్చాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

దశల వారీగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి.. కొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై పడగవిప్పుతూనే ఉంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి.. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలో ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం మరోసారి కరోనా వ్యాప్తిపై ఆందోళన కలిగిస్తుంది. కరోనా మొదలైన నాటి నుంచి కాలానుగుణంగా అది చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసి.. పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.