Telangana : మధ్యాహ్న భోజనం ప్రధానోపాధ్యాయుడు రుచి చూశాకే విద్యార్ధులకు వడ్డించాలి..

మధ్యాహ్న భోజన పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Telangana : మధ్యాహ్న భోజనం ప్రధానోపాధ్యాయుడు రుచి చూశాకే విద్యార్ధులకు వడ్డించాలి..

Telangana School Mid Day Meal

Guidelines for mid day plan implementation : మధ్యాహ్న భోజన పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యాహ్నా భోజనం తిని పలు సందర్భాల్లో విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం జరుగుతోంది. దీంతో ప్రభుత్వం మధ్యాహ్నా భోజన పథకం అమలో ఇకనుంచి ఎటువంటి అపశృతి జరుగకూడదని భావించింది. దీంతో పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి స్కూళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ప్రధానోపాధ్యాయుడు రుచి చూసి రిజిస్టర్‌లో నమోదు చేయాలని..ఆ తరువాతే విద్యార్ధులకు భోజనం వడ్డించాలని..ఈ విధానాన్ని ప్రతిరోజూ పాటించాలని స్పష్టం చేసింది విద్యాశాఖ.

దీనికి సంబంధించి స్కూళ్ల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన మంగళవారం (నవంబర్ 30,2021) మార్గదర్శకాలను విడుదల చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాల్లో నాణ్యమైన డబుల్‌ ఫోర్టిఫైడ్‌ ఉప్పును మాత్రమే వినియోగించాలని స్పష్టంచేశారు. టేస్టింగ్‌ రిజిష్టర్‌ చేయాలని..అలాగే భోజనానికి సంబంధించి బియ్యం ఎంత స్టాక్ ఉన్నాయి? పంపిణీ ఏ మేరకు జరిగింది? స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ మీటింగ్‌ మినిట్స్‌, భోజనం చేసిన పిలల్లు ఎంతమంది? వంటి వివరాలను రిజిస్టర్లను వేర్వేరుగా నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

  • మార్గదర్శకాల్లో ప్రధానాంశాలు ఇలా..
    మధ్యాహ్న భోజన పథకం వివరాలన్నీ నమోదు చేయాలి..ఏరోజు కారోజు మెనూను గోడమీద రాయించాలి..మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందజేయాలి.
  • విద్యార్ధులకు పోషకాహారాన్ని అందించాలని ప్రవేశ పెట్టిన కోడిగుడ్ల భోజనం ఉండాలి. వారానికి మూడు కోడిగడ్లు తప్పనిసరిగా ఇవ్వాలి..
    ఇందుకు సంబంధించి వంట ఏజెన్సీ నుంచి లిఖిత పూర్వక ఒప్పంద పత్రాన్ని తీసుకోవాలి…
  • రోజువారీగా భోజనం తీసుకొంటున్న విద్యార్థుల వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపాలి.
    స్కూలు విద్యార్థులతో మధ్యాహ్న భోజన కమిటీని ఏర్పాటు చేయాలి..
    బియ్యం, ఇతర సరుకులను విద్యార్థులతో తూకం వేయించి, రిజిష్టర్లో నమోదు చేయించాలి..
    బియ్యం నిల్వల్లో తేడాలుంటే ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది..ఈ బాధ్యత విస్మరించకూడదు..
  • నాణ్యమైన వేడి వేడి ఆహారాన్ని మాత్రమే విద్యార్థులకు వడ్డించాలి..
    ఆహారం, మంచినీరు కలుషితం కాకుండా ప్రధానోపాధ్యాయుడు జాగ్రత్త వహించాలి. వంటపాత్రలు, ప్లేట్లు శుభ్రంగా ఉండేలా చూడాలి…దానికి సంబంధించి పర్యవేక్షణ చూసుకోవాలి..
    100 శాతం విద్యార్థుల ఆధార్‌ నంబర్లు నమోదయ్యేలా చూడాలి..
  • స్కూల్లో తప్పనిసరిగా కిచెన్‌ గార్డెన్‌ డెవలప్ చేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.
    భోజనంలో పోషకాలుండేలా చూడాలి…
    మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్‌ఎంసీ సమావేశాల్లో సమీక్షించాలి.