Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ఈరోజు అంతా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Telangana : నల్గొండ జిల్లాలో మంత్రుల పర్యటన..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Telangana Ministers Visits Nalgonda

Telangana ministers visits nalgonda district : తెలంగాణ మంత్రులు నల్గొండ జిల్లా బాట పట్టారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం (డిసెంబర్ 31,2021) ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రులు 10:30 గంటలకల్లా నల్లగొండకు చేరుకున్నారు. మంత్రులకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికాయి. బైక్ ర్యాలీలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్, ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ హబ్ కార్యాలయానికి శంకుస్థాపనలు చేసారు.

Read more : Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

అలాగే 12:30 గంటలకు బీట్ మార్కెట్లో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ యార్డ్‌కు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు నల్లగొండ జైలుఖాన వద్ద రైతుబజార్, బస్తీల్లో ఏర్పాటు చేయటానికి స్థలాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి..ఈ పనులన్నీ పూర్తి చేసుకుని మంత్రుల బృందం హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.