Minister V Srinivas Goud : జితేందర్ రెడ్డి పీఏ కి మరోసారి నోటీసులు
ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కేసులో తెలంగాణ పోలీసులు రెండోసారి జితేందర్ రాజ్కు నోటీసులు జారీ చేశారు.
Minister V Srinivas Goud : ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్య కుట్ర కేసులో తెలంగాణ పోలీసులు రెండోసారి జితేందర్ రాజ్కు నోటీసులు జారీ చేశారు. రేపు తప్పని సరిగా హైదరాబాద్ లో కేసు విచారణ దర్యాప్తుకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలో మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డికి జితేందర్ రాజ్ పీఏగా ఉన్నారు.
మంత్రి హత్య కుట్ర కేసు విచారణ కోసం రెండు రోజుల్లో హైదరాబాద్ రావాలని మొదటగా మార్చి 3న పోలీసులు నోటీసులు జారీ చేసారు. జితేందర్ రాజ్ విచారణకు హాజరుకాక పోవడంతో పోలీసులు నిన్న మళ్ళీ నోటీసులు జారీ చేసారు.
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో ఢిల్లీలోని సౌత్ అవెన్యూ 105 జితేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ నుంచి మున్నూరు రవి,రాఘవేంద్ర రాజు,అమరేంద్ర రాజు,డ్రైవర్ థాపా అనే నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు.
Also Read : Kurnool Check Post : ఐదు కోట్లు విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం
ఢిల్లీ వచ్చిన ఈ నలుగురికి మాజీ ఎంపీ గెస్ట్ హౌస్లో జితేందర్ రాజ్ వసతి ఏర్పాట్లు చేశాడు.కాగా …తమ నాయకుడి నివాసం నుంచి నలుగురు కిడ్నాప్ గురైనట్లు మార్చి 1 న జితేందర్ రెడ్డి పిఎ జితేందర్ రాజ్ ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు ఫిర్యాదు చేసారు.